కరోనా టెస్ట్ లను బంద్ చేసిన తెలంగాణ ప్రభుత్వం 

కరోనా మూడో వేవ్ తొలగిపోయిన్నట్లు  తెలంగాణ వైద్యశాఖ ప్రకటించడంతో గ్రేటర్ హైదరాబాద్ లోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవఖానల్లో కరోనా టెస్టులను వైద్య సిబ్బంది నిలిపివేశారు. దగ్గు, జలుబు లక్షణాలతో రోగులు వెళ్లితే సీజనల్ వ్యాధిగా గుర్తిస్తూ మందులు ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారు. 
 
వైరస్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరంలేదని, తాము సూచించిన మెడిసిన్ వాడితే ఆరోగ్యం కుదుట పడుతుందని వైద్యులు సూచనలు చేస్తున్నారు.  దగ్గు, జలుబుతో పాటు వంటినొప్పులు, ఊపిరి సక్రమంగా తీసుకోకపోవడం లక్షణాలున్న వారు టెస్టులు చేయాలని కోరిన చేయడం లేదని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ఆరోగ్య పరంగా ఇబ్బంది పడేవారు వెంటనే స్దానికంగా ఉంటే ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లుతూ పరీక్షలు చేయించుకున్నారు. ఇదే అదను చూసి ప్రైవేటు ల్యాబ్ నిర్వహకులు అధిక ధరలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇంకా  వైరస్ ప్రభావం తగ్గలేదని, ఈనెలాఖరు వరకు లక్షణాలున్న వారికి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.
మూడో వేవ్ ప్రభావం తగ్గుతుందని వైద్యశాఖ ప్రకటించిన కరోనా నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.గ్రేటర్ వ్యాప్తంగా 196 ఆరోగ్య కేంద్రాలలో గత రెండు నెలల నుంచి సెలవులు లేకుండా వైద్య సిబ్బంది టెస్టులు చేస్తూ వ్యాధి నిర్దారణ చేస్తున్నారు. రోజుకు 120 మందికి పైగా టెస్టులు చేశారు.
ఇటీవల మూడో వేవ్ ముగిసిందని ఆరోగ్యశాఖ డైరెక్టర్ పేర్కొనడంతో వైద్య సిబ్బంది ఊపిరి పీల్చుకుని ఆరోగ్య కేంద్రాలకు వస్తే కరోనా పట్ల భయపడాల్సిన పనిలేదంటున్నారు. ప్రస్తుతం రోజుకు 40 నుంచి 50 మంది టెస్టుల కోసం వస్తున్నట్లు వైద్య సిబ్బంది వెల్లడిస్తున్నారు.
మరోవంక, కరోనా ఆంక్షలు ఎత్తివేయడంతో నగరవాసులు భౌతికదూరం పాటించకుండా, మాస్కులు సక్రమంగా ధరించకుండా ఉండటంతో లక్షణాలున్న వారి సంఖ్య కనిపిస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు. బస్సులు, ఆటోలు, కార్లు, మెట్రోలతో గుంపులుగా చేరుతున్నారు.
 
 అదే విధంగా విద్యాసంస్దలు కూడా ఒకేసారి ప్రారంభం కావడంతో దగ్గు, జలుబు ఉన్నవారు చాలామంది ఉన్నారని, దీంతో వారి ద్వారా సమీప ప్రజలపై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు.