`ఉగ్రవాద లింకులు’ ఆరోపణలపై బెంగాల్ యువకుడి అరెస్ట్

`ఉగ్రవాద లింకులు’ ఆరోపణలపై బెంగాల్ యువకుడి అరెస్ట్
పశ్చిమ బెంగాల్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టిడిపి) సభ్యుడితో కలిసి ఆ సంస్థలో చేరడానికి, పాకిస్థాన్ సైన్యంపై, భారతదేశంపై ప్రతీకార దాడులకు ప్రణాళిక రచించడానికి కుట్ర పన్నాడని ఆరోపణలు ఉన్నాయి. అనుమానాస్పద ఆన్‌లైన్ కార్యకలాపాలు, ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై బెంగళూరులోని జిగాని ప్రాంతంలో 25 ఏళ్ల అసఫూల్ మాలిక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
మాలిక్ పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని నౌపారా గ్రామానికి చెందినవాడు. డిసెంబర్ 2025 నుండి జిగాని ఇండస్ట్రియల్ ఏరియాలోని టాటా అడ్వాన్స్‌డ్ లిమిటెడ్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియాలో గస్తీ నిర్వహిస్తున్నప్పుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక వ్యక్తి అనుమానాస్పద కార్యకలాపాల గురించి తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. 
 
పాకిస్థాన్‌లో ముస్లింలపై పాకిస్థాన్ సైన్యం పాల్పడుతోందని తాను నమ్మిన అకృత్యాల పట్ల ఆగ్రహంతో ఉన్నానని మల్లిక్ ఒప్పుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారం ఆధారంగా, పోలీసులు మల్లిక్‌ను ప్రశ్నించగా, పాకిస్తాన్‌లో మసీదులు, పౌరులపై దాడులతో సహా ముస్లింలపై పాకిస్థాన్ సైన్యం పాల్పడుతోందని తాను నమ్మిన అకృత్యాల పట్ల ఆగ్రహంతో ఉన్నానని అతను ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. 
 
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై పాకిస్థాన్ వైఖరి పట్ల కూడా అతను ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భారతదేశంలో ముస్లింలు ఇబ్బందులు ఎదుర్కొంటే ప్రతీకారం తీర్చుకోవాలని మల్లిక్‌ను కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి. మల్లిక్, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఇమ్రాన్ హైదర్ అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పరచుకున్నాడని, ఇతను తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్‌తో సంబంధం కలిగి ఉన్నాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. 
 
మల్లిక్, ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లడానికి ఇమ్రాన్ హైదర్ సహాయం కోరి, వీసా కోసం దరఖాస్తు చేసుకోగా, ఆర్థిక ఇబ్బందులు, తన కుటుంబాన్ని పోషించుకోవాల్సిన అవసరం కారణంగా తాను ఆ ప్రణాళికను తర్వాత విరమించుకున్నట్లు మల్లిక్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. తదనంతరం పోలీసులు మల్లిక్ మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, అతనికి, ఇమ్రాన్ హైదర్ కు మధ్య జరిగిన చాట్‌లతో పాటు, అనేక వాయిస్ కాల్స్, ఆడియో సంభాషణల రికార్డులను కనుగొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.