
కాగా, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన టీఎంసీ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని ప్రజల ఆగ్రహం ప్రతిబింబిస్తోందని జవహర్ సిర్కార్ విమర్శించారు. ప్రభుత్వంపై ఇలాంటి పూర్తి అవిశ్వాసాన్ని తాను ఇప్పటి వరకు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలు ప్రధానంగా రాజకీయ ఉద్దేశ్యాలతో కాకుండా న్యాయం, నిందితులను శిక్షించాలని జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. సంఘర్షణ లేని విధానాన్ని అనుసరించాలని ఆయన పార్టీని కోరారు.
పార్టీలో ఆప్తుల, అవినీతిపరులకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని, ఒక వర్గం నాయకుల పటిష్టమైన వ్యూహాల గురించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తుండటంతో తనకున్న భ్రమలు పూర్తిగా తొలగిపోయాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఎన్నికైన పలువురు పంచాయితీ, మునిసిపల్ నేతలు అవినీతితో పెద్ద ఎత్తున ఆస్తులను సంపాదించడం చూసి ఆశ్చర్యపోయానని, ఇవి తనకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా బాధ కలిగిస్తున్నాయని ఆయన తెలిపారు.
మరోవైపు పార్టీ పంథాను సరిదిద్దుకోకుంటే ‘మతోన్మాద శక్తులు రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటాయని జవహర్ సిర్కార్ హెచ్చరించారు. ‘మూడేళ్లుగా బెంగాల్ సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తడానికి మీరు ఇచ్చిన అవకాశానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కానీ ఎంపీగా కొనసాగడం నాకు ఇష్టం లేదు. కేంద్రం, రాష్ట్రాల్లో అవినీతి, మతతత్వం, నిరంకుశత్వంపై పోరాడటమే నా నిబద్ధత. ఇందులో చర్చలకు తావులేదు’ అని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
More Stories
బెంగాల్ ప్రతిపక్ష నేత బడ్జెట్ సమావేశాల్లో సస్పెన్షన్
జాతీయ పార్టీల ఆదాయాలలో 74 శాతం బీజేపీకే
`చైనా శత్రువు’ కాదన్న పిట్రోడా వాఖ్యలపై దుమారం