ఈ కేసు నిందితుల్లో ఒకరైన విజయ్ నాయర్ తరుచుగా కేజ్రీవాల్ ఆఫీసును సందర్శించారని, అక్కడే టైం గడిపారని ఈడీ వివరించింది. కేజ్రీవాల్ తో మద్యం పాలసీ గురించి చర్చించినట్లు ఢిల్లీ మద్యం వ్యాపారులకు విజయ్ నాయర్ చెప్పారని ఆరోపనలు ఉన్నాయి. కేజ్రీవాల్ ను ఇండో- స్పిరిట్ ఓనర్ సమీర్ మహేందుతో కలిపేందుకు విజయ్ నాయర్ ప్రయత్నించినా కుదరలేదు.
సిసోడియాతో భేటీ తర్వాత కేజ్రీవాల్తో మాట్లాడేందుకు ఆయన ఇంటికి వెళ్లినప్పుడు అక్కడే ఉన్న సత్యేంద్ర జైన్ తనకు ఒక నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. మంత్రుల కమిటీలో ఎటువంటి ప్రతిపాదన చర్చించకున్నా, ఆ నివేదిక ఆధారంగా మంత్రుల కమిటీ నివేదిక రూపొందించాలని తనకు చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని అరవింద్ చెప్పారు.
ఈడీ కధనం ప్రకారం అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ నేత కే. కవిత, శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిసి కుట్ర చేశారు. 2021-22 లిక్కర్ పాలసీ ‘డీల్’లో భాగంగా శరత్, మాగుంట, కవితలకు దిల్లీలోని 32 జోన్లలో 9 జోన్లు దక్కాయి. పాలసీలో హోల్సేలర్స్కి 12 శాతం, రీటైర్లకు 185 శాతం ప్రాఫిట్ మార్జిన్ వస్తుంది. ఇది సాధారణం కన్నా చాలా చాలా ఎక్కువ!
ఈ కేసులో ఇప్పటికే నలుగురు కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. వారు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కవిత, ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్. ఈ 12 శాతం ప్రాఫిట్లో 6శాతం ప్రాఫిట్స్ని హోల్సేలర్స్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వసూలు చేయాలని డీల్ కుదిరిందని ఈడీ ఆరోపిస్తోంది. కుట్రకు పాల్పడింది కవితే అయినా.. ఈ లిక్కర్ పాలసీ అనేది కేజ్రీవాల్ సృష్టి అని ఈడీ చెబుతోంది. ఈ విషయాన్ని, ఇదే కేసులో కీలక నిందితుడుగా ఉన్న వ్యాపారవేత్త సమీర్ మహేంద్రు చెప్పినట్టు ఈడీ పేర్కొంది.
“ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో కలిసి కవిత లిక్కర్ స్కామ్కు పాల్పడ్డారు. నాటి ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్శాఖ మంత్రి సిసోడియా హస్తం కూడా ఉంది. మధ్యవర్తుల ద్వారా కవిత, సౌత్ గ్రూప్ కలిసి ఆమ్ ఆద్మీకి ముడుపులు చెల్లించింది. ఫలితంగా కవితకు పాలసీ ఫార్ములేషన్పై పట్టు దక్కింది. కవిత కోరుకున్నట్టుగా ఆమెకు ఈ పాలసీలో ప్రయోజనం చేకూరింది,” అని గత వారం బీఆర్ఎస్ నేతను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన అనంతరం ఓ ప్రకటనలో పేర్కొంది ఈడీ.
More Stories
చదువుల్ని లోకకల్యాణం కోసం ఉపయోగించాలి
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్