మణిపూర్లో ఏప్రిల్ 19న జరిగిన తొలి విడత ఎన్నికల్లోనూ ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు జరిగాయి. సుమారు 3,000 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగగా, 11 పోలింగ్ కేంద్రాల్లో హింసాత్మక ఘటనలు చేటుచేసుకున్నాయి. ఈవీఎంలను కొందరు దుండగులు ధ్వంసం చేశారు. దీంతో 11 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్ చెల్లదని ప్రకటించిన ఈసీ రెండో విడత పోలింగ్కు నాలుగు రోజుల ముందు ఏప్రిల్ 22న రీపోలింగ్ నిర్వహించింది.
అపరిష్కృత సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ అధికారుల వైఫల్యానికి నిరసగా కుకీ-జోమి తెగకు చెందిన పలు పౌర సమాజ సంస్థలు, గ్రూపులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చాయి. ‘నో జస్టిస్ నో ఓట్’ అనే సిద్ధాంతానికి అనుగుణంగా ఎన్నికల బహిష్కరణకు నిర్ణయించినట్టు ఆ గ్రూపులు ప్రకటించాయి.
కొన్ని బుల్లెట్లు గ్రామస్తుల ఇళ్లను నాశనం చేశాయని పేర్కొన్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులను సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా తయారయ్యే పంపి అని పిలిచే మోర్టార్ షెల్స్ను గ్రామంపై ప్రయోగిస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఈనెల 26న ఇంఫాల్ తూర్పు సరిహద్దులోని సినామ్ కోమ్ గ్రామంలో రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయని, ఈ ప్రమాదంలో 33 ఏళ్ల గ్రామ వాలంటీర్ మృతి చెందాడు. మణిపూర్లో 2023 మే నుంచి మెయితీలు, కుకీల మధ్య జాతుల వైరం భగ్గుమని హింసాత్మక ఘటనలు చేటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 60,000 మందికి పైగా నిరాశ్రయిలయ్యారు.
More Stories
లోక్సభ నాలుగో విడత 5 గంటల వరకు 62.31% ఓటింగ్
పోలీసుల అదుపులో తెనాలి, తాడిపత్రి వైసిపి ఎమ్యెల్యేలు
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి మాధవీలతపై కేసు నమోదు