మరోవంక, దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు జాతీయ పార్టీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. తమిళనాడులో సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్ ప్రాంతీయ పార్టీ పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)తో పొత్తు పెట్టుకుంది. పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ తైలపురంలో గల నివాసానికి మంగళవారం ఉదయం తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై వచ్చారు.
లోక్ సభ సీట్ల గురించి ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగింది. లోక్ సభ ఎన్నికల్లో 10 సీట్లను పీఎంకే కేటాయించామని అన్నామలై ప్రకటించారు. ప్రధాని మోదీ మాదిరిగా సమాజానికి మంచి చేయాలనే తపన రాందాస్కు ఉందని ప్రశంసించారు. దక్షిణ తమిళనాడులో వన్నియార్ కులం ప్రభావం ఉంటుంది. పీఎంకేకు ఆ సామాజికవర్గం ఓటు బ్యాంక్ ఉంది. ఎన్డీఏ కూటమిలో పీఎంకే గత పదేళ్ల నుంచి భాగస్వామిగా ఉంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ కూడా పాల్గొన్నారు.
ఇలా ఉండగా, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను దేశ రాజధాని ఢిల్లీలో కలవడంతో ఆయన కూడా ఎన్డీయేలో చేరుతున్నారనే ఊహాగానాలు వెలువడ్డాయి. లోక్సభ ఎన్నికల్లో కూటమి తరఫునే ఎంఎన్ఎస్ అభ్యర్థులు పోటీ పడబోతున్నారనే ప్రచారం జరుగుతన్నది. కాగా, ఎంఎన్ఎస్ 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. 2019 లోక్సభ ఎన్నికల్లో అసలు బరిలో దిగలేదు.
More Stories
ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు
కేజ్రీవాల్ జైలులో పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు