మహారాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ సుమారు 2.5 కోట్ల కుటుంబాల సామాజిక స్థితిగతులపై ఇటీవల సర్వే జరిపి నివేదికను అందజేసింది. మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించడం సమంజసమేనని నివేదిక పేర్కొంది. రాష్ట్ర జనాభాలో మరాఠా కమ్యూనిటీకి చెందిన వారు 28 శాతం ఉన్నారని, 21.22 శాతం ఎల్లో రేషన్ కార్డులతో దాదాపు మరాఠా కుటుంబాలన్నీ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాయని తెలిపింది.
ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో జరిపిన సర్వేలోనూ 84 శాతం మరాఠా కుటుంబాలు ప్రొగ్రసివ్ క్యాటగిరిలో లేవని తేలింది. ఇంద్ర సాహనీ కేసు కింద వీరంతా రిజర్వేషన్ ప్రయోజనాలకు అర్హులని సర్వే స్పష్టం చేసింది. కాగా, ప్రస్తుతం ఇతర కమ్యూనిటీలకు వర్తిస్తున్న రిజర్వేషన్ కోటాకు భంగం కలుగకుండానే మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు.
అయినప్పటికీ, మరాఠా కమ్యూనిటీని ఓబీసీ క్యాటగిరిలో చేర్చడంపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. గతంలోనే రెండు సార్లు అసెంబ్లీ ఇటువంటి తీర్మానాలు చేసినా ప్రయోజనం లేకపోవడం గమనార్హం. మరోవైపు, మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్ల విషయంలో న్యాయ పోరాటాలు కూడా చోటుచేసుకున్నాయి.
కాలేజీ అడ్మిషన్లు, ఉద్యగాల్లో మరాఠీ ప్రజలకు రిజర్వేషన్లు కల్పించడం చెల్లనేరదని 2021లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనివార్య పరిస్థితుల్లోనే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతాన్ని దాటి రిజర్వేషన్లు ఉండరాదని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.
More Stories
వీసీల నియామకంపై రాహుల్ వాఖ్యాలపై విద్యావేత్తల ఆగ్రహం
ఎన్నికల వేళ అయోధ్యలో మోదీ రామయ్య దర్శనం
ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీస్