మోదీ ఉన్నా, లేకున్నా దేశం ఉంటుందని హామీ ఇచ్చారు. తాను దేశం కోసం అహోరాత్రులు శ్రమిస్తున్న తీరు ప్రజలు చూస్తున్నారని, నిజాయితీతో సేవలందించడమే తన ధర్మమని చెప్పారు. రాజకుటుంబ వారసుడే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కావచ్చన్న ఆచారాన్ని ఈ టీ అమ్మేవాడు తుంగలో తొక్కాడని ప్రధాని ఉద్ఝాటించారు.“పదేళ్ల పదవీకాలం తర్వాత ఇంకోసారి మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. మీరందరూ నా కష్టాన్ని చూశారు. నిజాయితీతో మీరందరకీ సేవ చేయడమే నా ధర్మం. మోదీ భారత్ కోసం వచ్చే ఐదేళ్లు కాదు 25 ఏళ్ల కోసం బాటలు వేస్తున్నారు. మోదీ ఉన్నా లేకపోయినా దేశం ఎప్పటికీ ఉంటుంది” అని తెలిపారు.
“ఎస్పీ, కాంగ్రెస్లు ఏం చేస్తున్నాయి? తమ భవిష్యత్తు కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. మోదీ ఎవరి కోసం పనిచేస్తున్నారు? నేను ఏదీ వెనుక దాచుకోలేదు. యోగీ కూడా అలాగే ఉంటారు. మోదీ అలాగే ఉంటారు. యోగీ, మోదీ ఎవరి కోసం పనిచేస్తున్నారు. మాకు పిల్లలు లేరు. మీ పిల్లల కోసమే మేం పనిచేస్తున్నాం” అని చెప్పుకొచ్చారు. రాజకుటుంబ వారసుడే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కావచ్చన్న ఆచారాన్ని ఈ టీ అమ్మేవాడు తుంగలో తొక్కాడని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన ఎస్పి, కాంగ్రెస్ మిత్ర పక్షాలుగా ఉత్తర ప్రదేశ్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలపై విమర్శనాస్త్రాలను మోదీ సంధిస్తూ, ‘ఆ ఆనువంశిక వ్యక్తుల వారసత్వ చరిత్ర ఏమిటి& కార్లు, బంగళాలు, రాజకీయ పలుకుబడి. కొందరు మైన్పురి, కన్నౌజ్, ఎటావాలను తమ జాగీర్లుగా పరిగణిస్తుంటారు, కొందరు అమేథి, రాయబరేలిలను తమ జాగీర్లుగా భావిస్తుంటారు’ అని ధ్వజమెత్తారు.
‘మోదీ సృష్టించిన వారసత్వ సంపద ప్రతి ఒక్కరి కోసం. 2047లో, మీ కుమారుడు, కుమార్తె కూడా ప్రధాని లేదా ముఖ్యమంత్రి కావాలని వాంఛిస్తున్నా. రాజకుటుంబాల వారసులు మాత్రమే పిఎం లేదా సిఎం కాగలరన్న దుష్ట సంప్రదాయాన్ని ఈ ‘చాయివాలా’ ఛేదించాడు’ అని ప్రధాని చెప్పారు.
More Stories
ఐపీఎల్ పదిహేడో సీజన్ ఫైనల్ సమరం నేడే
ఆరో విడతలో 61.25 శాతం పోలింగ్
ఐదు దశల ఓటింగ్ సమాచారం వెల్లడించిన ఎన్నికల కమిషన్