వీసీలను కేవలం ప్రతిభ ఆధారంగా కాకుండా ఏదో ఒక సంస్థతో అనుబంధం ఆధారంగా నియమించారని రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
వీసీలను ఎంపిక చేసే ప్రక్రియ ప్రతిభ, విద్య, పరిపాలనా నైపుణ్యంపై ఆధారపడి ఉంటుందని లేఖలో విద్యావేత్తలు తెలిపారు. వీసీల నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు.
విశ్వవిద్యాలయాలను మరింత ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. “కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజకీయంగా మైలేజ్ పొందాలనే ఉద్దేశంతో యూనివర్సిటీల్లో వీసీల నియామకాలపై అసత్య ఆరోపణలు చేశారు. ఆయనపై వెంటనే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి” అని స్పష్టం చేశారు.
“విద్యాసంస్థల నిర్వహకులుగా నైతికత, సంస్థాగత సమగ్రతను కాపాడుకోవడంలో మంచి నిబద్ధతను కలిగి ఉన్నాం. కల్పిత కథలు, నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేయడం మానుకోవాలి. దేశంలోని యూనివర్సిటీలు గ్లోబల్ ర్యాంకింగ్స్, ప్రపంచ స్థాయి పరిశోధనలు, ఆవిష్కరణలలో ముందున్నాయి. యూనివర్సిటీల అభివృద్ధిలో వీసీల కృషి కూడా ఉంది.” అని బహిరంగ లేఖలో విద్యావేత్తలు తెలిపారు.
ఈ లేఖపై జేఎన్యూ వీసీ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్, ఢిల్లీ యూనివర్సిటీ వీసీ యోగేశ్ సింగ్, ఏఐసీటీఈ ఛైర్మన్ టీజీ సీతారాం, బీఆర్ అంబేడ్కర్ నేషనల్ లా యూనివర్సిటీ వీసీ సహా పలువురు విద్యావేత్తలు సంతకం చేశారు.“ఈ ఎంపిక పూర్తిగా అకడమిక్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పరాక్రమంపై ఆధారపడి ఉంది మరియు విశ్వవిద్యాలయాలను ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో ఉంది” అని వారు చెప్పారు. వారు గాంధీ యొక్క నిర్దిష్ట వాదనలను ఉటంకించనప్పటికీ, ఆర్ఎస్ఎస్ తో అనుబంధాలు విద్యాసంస్థల నియామకాలలో తరచుగా మార్గదర్శక కారకంగా ఉంటాయని కాంగ్రెస్ నాయకుడు గతంలో ఆరోపించారు.
More Stories
ముగిసిన ఇదో విడత ప్రచారం … రేపే పోలింగ్
ఆరు నెలల్లో భారత్ లో భాగం కానున్న ఆక్రమిత కాశ్మీర్
కేంద్రంలో పదేళ్లుగా దమ్మున్న ప్రభుత్వం