
*ఇంగ్లండ్ను కూల్చేసిన భారత స్పిన్నర్లు
భారత స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా 12.4 ఓవర్లలో 41 పరుగులే ఇచ్చి 5 వికెట్లను పడగొట్టాడు. ఇంగ్లిష్ బ్యాటింగ్ లైనప్ను వణికించాడు. మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు, రవిచంద్రన్ అశ్విన్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఇంగ్లండ్ బ్యాటర్లలో పదో స్థానంలో వచ్చిన మార్క్ వుడ్ (33) మినహా మరెవరూ కూడా కనీసం 20 పరుగుల మార్క్ చేరలేకపోయారు. భారత స్పిన్ ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయి కుప్పకూలింది స్టోక్స్ సేన. 39.4 ఓవర్లలోనే రెండో ఇన్నింగ్స్ ముగించి.. భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మూడో టెస్టులో గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఇంగ్లండ్తో ఈ మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో గెలిచి రికార్డు సృష్టించింది టీమిండియా. టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా భారత జట్టుకు ఇదే అత్యంత పెద్ద విజయంగా ఉంది. అద్భుతమైన ఆట తీరుతో రోహిత్ శర్మ సేన ఈ గ్రాండ్ విక్టరీని అందుకుంది.
More Stories
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ప్రయాగ్రాజ్ మహాకుంభ్ నుండి సనాతన- బౌద్ధ ఐక్యత సందేశం
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా