మణిపూర్ చురాచంద్‌పూర్‌లో ఉద్రిక్తత.. ఇద్దరు మృతి

మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ పట్టణంలో పరిస్థితి శుక్రవారం కూడా ఉద్రిక్తంగానే ఉందని పోలీసులు వెల్లడించారు. ఒక కానిస్టేబుల్ సస్పెన్షన్‌కు నిరసన సూచకంగా ఒక గుంపు గురువారం మినీసెక్రటేరియట్‌లోకి దూసుకుపోయినప్పుడు భద్రత దళాలతో జరిగిన సంఘర్షణలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. గురువారం రాత్రి జరిగిన ఘర్షణలో మరి 42 మంది కూడా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. 

వైరల్ అయిన వీడియోలో సాయుధ వ్యక్తుల వెంట ఉన్నట్లుగా కానిస్టేబుల్ శ్యామ్‌లాల్‌పాల్ కనిపించిన తరువాత అతనిని సస్పెండ్ చేశారు. మృతులను లెత్లాల్‌ఖువోల్ గంగ్తె, తంగున్‌లెన్ హవోకిప్‌గా గుర్తించినట్లు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ‘తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులను చురాచంద్‌పూర్ జిల్లా ఆసుపత్రిలో చేర్చించినట్లు ఆయన తెలిపారు. ‘చురాచంద్‌పూర్ జిల్లా మినీ సెక్రటేరియట్ ప్రాంతం పరిసరాల్లో ఆస్తుల విధ్వంసం, దగ్ధం వార్తలు వచ్చాయి’ అని ఆ అధికారి చెప్పారు. 

 ‘ముఖ్యమైన పలు పత్రాలు, ప్రభుత్వ రికార్డులను హింసాకాండలో ధ్వంసం చేశారుర’ అని అధికారి తెలియజేశారు. డిప్యూటీ కమిషనర్ అధికార నివాసాన్ని కూడా అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఆగ్రహోదగ్రులైన మూకలు నిప్పు అంటించినట్లు పోలీసులు తెలిపారు. హింసాత్మక ఘటనల దృష్ట్యా జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్‌ను నిలిపివేశారు.

చురచంద్‌పూర్ జిల్లా పోలీసులకు చెందిన సియామ్‌లాల్‌పాల్‌పై డిపార్ట్‌మెంటల్ విచారణ జరుపుతున్నామని, ఫిబ్రవరి 14న అతను సాయుధ వ్యక్తులతో వీడియో తీస్తున్నట్లు సోషల్ మీడియాలో క్లిప్ వైరల్ కావడంతో, చురచంద్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ శివానంద్ సర్వే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. తమను తాము “గ్రామ రక్షణ వాలంటీర్లు” అని పిలుచుకునే కొండ-మెజారిటీ కుకీ-జో తెగలు, లోయ-మెజారిటీ మెయిటీస్ మధ్య జాతి ఉద్రిక్తతల దృష్ట్యా ప్రత్యర్థి సాయుధ సమూహాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.

రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న చురచంద్‌పూర్‌లో “సుమారు 300-400 మందితో కూడిన గుంపు పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంపై దాడికి ప్రయత్నించి, రాళ్లు రువ్వడంతో  నిరసనకారులను చెదరగొట్టేందుకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఎఎఫ్) టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించగా పలువురు నిరసనకారులు గాయపడ్డారు” అని థెయ్ల్పారు.