మంగళవారం అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి టిడిపి ఎమ్మెల్యేలు నిరసనలతో సభను హోరెత్తించారు. నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ వాయిదా తీర్మానానికి పట్టుబట్టగా, అందుకు స్పీకర్ నిరాకరించారు. దీంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి పేపర్లు చింపుతూ నినాదాలు చేశారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ టీ బ్రేక్ ఇచ్చారు.
టీ బ్రేక్ తర్వాత సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు మళ్లీ వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టారు. అందుకు స్పీకర్ తిరస్కరించారు. దీంతో మళ్లీ స్పీకర్ పోడియంపైకి వెళ్లిన టీడీపీ సభ్యులు గట్టిగా నినాదాలు చేశారు. మరోవైపు, టిడిపి సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు పలు బిల్లులను ప్రవేశ పెట్టారు. దీంతో, టిడిపి సభ్యులు పోడియంలోకి దూసుకుపోయారు.
పోడియం ఎక్కి మరీ నినాదాలు చేశారు. స్పీకర్ ఛైర్ వద్దకు దూసుకొచ్చిన టిడిపి సభ్యులు… బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో శాసనసభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. వైసీపీ సభ్యులు సభలో మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు ఈలలు వేసి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.
సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలను బయటకు వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు. మార్షల్స్ వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఈలలు వేసుకుంటూనే బయటకు వెళ్లారు. టీడీపీ సభ్యుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. స్పీకర్ తో టీడీపీ సభ్యులు అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. స్పీకర్ తో టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తన సరికాదని, పేపర్లు చింపి, ఈలలు వేస్తూ స్పీకర్ను అవమానిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. రు.
More Stories
ధర్మవరంలో బిజెపి కార్యకర్తలలపై రెచ్చిపోయిన వైసీపీ మూకలు
బీజేపీ గెలుపు మన దేశానికి అవసరం
ఏపీలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సీఆర్పీఎఫ్ బలగాలు