మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నదని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా 4.2 బిలియన్ల మంది వాడుతున్న సోషల్ మీడియా మితంగా ఉపయోగిస్తే మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలను కూడా చూపుతుంది, ఉదాహరణకు, అనేక ఆన్లైన్ కమ్యూనిటీలు వ్యక్తులు తమ ఆలోచనలు, భావాలను పంచుకోవడానికి సురక్షితమైన స్థలాన్ని అందించడం ద్వారా సోషల్ మీడియా వారికి ఆసరాగా ఉన్నామన్న కలిగిస్తుంది.
అనేక ఖాతాలు స్వీయ సంరక్షణ, శరీర సానుకూలత, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సానుకూల సందేశాలను ప్రచారం చేయడంతో కూడా ప్రేరణ కలిగిస్తున్నాయి.దురదృష్టవశాత్తు,సోషల్ మీడియా ముఖ్యంగా యువతలో ఆందోళన, డిప్రెషన్, ఒంటరితనం వంటి భావాలను పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.సోషల్ మీడియా సైబర్ బెదిరింపు, వేధింపులకు కూడా మూలం కావచ్చు, ఇది మానసిక శ్రేయస్సుపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుంది.
అదనంగా, సోషల్ మీడియా వ్యసనపరుడైన ప్రవర్తనల అభివృద్ధికి దోహదం చేస్తుంది, కొంతమంది వ్యక్తులు తమ పరికరాల నుండి డిస్కనెక్ట్ చేయడం కష్టం.
వీటిని పరిగణనలోకి తీసుకొన్న అమెరికాలోని న్యూయార్క్ సోషల్ మీడియాను పొగాకు, గన్స్లాగా ప్రజారోగ్యానికి ప్రమాదకరం, పర్యావరణ విషం అని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ సోషల్ మీడియా వాడకంపై మార్గదర్శకాలు కూడా జారీచేశారు.
టిక్టాక్, యూట్యూబ్, ఫేస్బుక్ వాడకంతో పిల్లల్లో మానసిక రుగ్మతలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. సామాజిక మాధ్యమం వినియోగంపై మార్గదర్శకాలు జారీచేసిన తొలి అమెరికన్ నగరంగా న్యూయార్క్ నిలిచింది. సోషల్ మీడియాను రోజులో ఎక్కువసేపు వినియోగిస్తుండటంతో పిల్లల్లో డిప్రెషన్ స్థాయిలు దశాబ్దంలోనే గరిష్ఠ స్థాయిని తాకినట్టు పలు అధ్యయనాల్లో తేలింది.
వారాంతాల్లో 77 శాతం మంది హైస్కూల్ విద్యార్థులు హోంవర్క్ను వదిలేసి రోజులో మూడు లేదా అంతకంటే ఎక్కువ గంటలసేపు స్క్రీన్కు అతుక్కుపోతున్నట్టు గుర్తించారు. సోషల్ మీడియా విపరీత వినియోగం ప్రజారోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నదని న్యూయా ర్క్ నగర డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్ తేల్చింది. సోషల్మీడియా వాడకంపై తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలకు పరిమితి విధించాలని ఆడమ్స్ మార్గదర్శకాల్లో సూచించారు.
టీనేజర్లు ఆన్లైన్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్లను ఆపేస్తూ మానసిక ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని సూచించారు. టిక్టాక్, యూట్యూబ్ ఫేస్బుక్లాంటి సోషల్మీడియా ప్లాట్ఫాంలు పిల్లలను వ్యసనపరులుగా మార్చేలా ఫీచర్స్ను అందుబాటులోకి తెచ్చి, పిల్లల్లో మానసిక ఆరోగ్య సంక్షోభానికి ఆజ్యం పోస్తున్నాయని తెలిపారు.
తమ నగర టీనేజర్లను వీటికి బానిసలుగా మారకుండా మార్గదర్శకాలు జారీ చేసినట్టు చెప్పారు. చాలామంది దైనందిన జీవితాల్లో సోషల్మీడియా ఓ భాగమైపోతుండటం పట్ల ఆందోళన వ్యక్తం అవుతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ (ఎక్స్), యూట్యూబ్, వాట్సాప్ వంటి వేదికలను యువత నుంచి వృద్ధులకు వరకూ అధికంగా వినియోగిస్తున్నారు.
More Stories
జమ్ముకశ్మీర్లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు