తమిళనాడు ప్రభుత్వం ప్రతి ఏడాది కావేరి నీటిని విడుదల చేయాలంటూ ‘కావేరి వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ’ అథారిటీకి లేఖ రాస్తుందని, తమ దగ్గర నీళ్లు లేకపోయినా, తమ అధికారులు చెప్పేది వినకుండా అథారిటీ తమిళనాడుకు నీళ్లు విడుదల చేయాలని ఆదేశిస్తుందని దేవేగౌడ ఆవేదన వ్యక్తంచేశారు.
వాస్తవానికి కావేరి అథారిటీ ఎన్నడూ కర్ణాటకకు రాదని, తమ రిజర్వాయర్లలో ఎన్ని నీళ్లు ఉన్నాయో కూడా చూడదని ఆయన విమర్శించారు. తాను తన ఊపిరి ఉన్నంత వరకు కావేరి సమస్య పరిష్కారం కోసం పోరాటం చేస్తానని దేవేగౌడ చెప్పారు.
తాను ఇంకా రెండున్నరేళ్లు రాజ్యసభ సభ్యుడిగా ఉంటానని, ఈ రెండున్నరేళ్లు తాను సభలో నోర్మూసుకుని కూర్చోనని తేల్చి చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు తాను ఫిబ్రవరి 1న ఢిల్లీకి వెళ్తున్నానని, ఈ సందర్భంగా రాజ్యసభలో కావేరి సమస్యపై తన గళం బలంగా వినిపిస్తానని ఆయన తెలిపారు.

More Stories
`నేను నా కూతురిని కోల్పోయాను, మమతా పదవి కోల్పోయింది’
నీట్ యూజీ రీ-టెస్ట్ను సజావుగా జరిపేందుకు సహకరించండి
యూపీ అసెంబ్లీ, సెక్రటేరియట్ పై ఉగ్ర దాడికి భారీ కుట్ర