రాజస్థాన్లో అసెంబ్లీ సమావేశాలు జనవరి నుంచి ఆగస్టు వరకూ కొనసాగాయి. 2020, 2021లలో రాజస్థాన్ అసెంబ్లీ సెషన్ జనవరి నుంచి డిసెంబరు వరకూ కొనసాగడం విశేషం. పశ్చిమ బెంగాల్లో జూలైలో ప్రారంభమైన సెషన్ను 2024 మార్చి వరకూ వాయిదా వేయలేదు. రాష్ట్ర బడ్జెట్ను ఆమోదించడానికి ఫిబ్రవరిలో నిర్వహించిన సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కాలేదు.
సిక్కిం, తమిళనాడు, తెలంగాణలల్లో ఏడాదికి పైగా సమావేశాలు కొనసాగాయి. సిక్కింలో 2022 మార్చిలో ప్రారంభమైన సమావేశాలు 2023 ఏప్రిల్లో వాయిదా పడ్డాయి. తెలంగాణలో 2021 సెప్టెంబరు నుంచి 2023 ఆగస్టులో సభా కాలం ముగిసే వరకూ ఒకే సెషన్ కొనసాగింది.
సమావేశాల సంఖ్య తక్కువైనప్పటికీ 2023లో 500కి పైగా బిల్లులను, రూ.53 లక్షల కోట్లకు పైగా బడ్జెట్లను రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించాయి. అసెంబ్లీల్లో ప్రవేశపెట్టిన బిల్లుల్లో 44 శాతం ఒక్కరోజులోనే ఆమోదం పొందాయి. గుజరాత్, ఝార్ఖండ్, మిజోరాం, పుదుచ్చేరి, పంజాబ్ అసెంబ్లీలు ప్రవేశపెట్టిన రోజు లేదా మరుసటి రోజే అన్ని బిల్లులను ఆమోదించాయి.
కేరళ, మేఘాలయ అసెంబ్లీలు 90శాతానికి పైగా బిల్లులను ఆమోదించడానికి ఐదు రోజులకు పైగా సమయం తీసుకున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కలిపి 59 శాతం బిల్లులకు సగటున నెల రోజుల్లోపే గవర్నర్ ఆమోదం లభించింది. బిహార్, గుజరాత్, హరియానా, యూపీ సహా ఏడు రాష్ట్రాలో నెలరోజుల్లోపే అన్ని బిల్లులు ఆమోదం పొందాయి.
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెండు నెలలకు కూడా అత్యధిక శాతం బిల్లులు ఆమోదం పొందని రాష్ట్రాలు… అసోం (80 శాతం), నాగాల్యాండ్ (57 శాతం), జార్ఖండ్ (50 శాతం), పశ్చిమ బెంగాల్ (50 శాతం). పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత ఆమోదం పొందడానికి సగటున 92 రోజులు పట్టగా, అసోం- 73 రోజులు, జార్ఖండ్- 72 రోజులు, కేరళ-67 రోజులు, హిమాచల్ప్రదేశ్-55 రోజులతో ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్ జాప్యం చేయడాన్ని 2023 నవంబరులో కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఇదే అంశంపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.
More Stories
వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు
రాహుల్ తో చర్చకు బిజెపి రాయబరేలి యువనేత!
చాబహార్ పోర్ట్పై భారత్ – ఇరాన్ ల మధ్య చారిత్రక ఒప్పందం