`కాబట్టి భాషాపరమైన వైవిధ్యాన్ని గౌరవించాలి. సొంతభాష, సాహిత్యం, సంస్కృతితో ముడిపడిన అనేక రాష్ట్రాలు మన దేశంలో చాలా ఉన్నాయి. అందువల్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మిమ్మల్ని (నితీశ్ కుమార్ని ఉద్దేశించి) గౌరవపూర్వకంగా వేడుకుంటున్నా’ అంటూ ఎక్స్లో రాసుకొచ్చారు.
కాగా, ఢిల్లీలో మంగళవారం జరిగిన ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ సమావేశంలో నితీశ్ కుమార్ హిందీలో ప్రసంగించారు. అయితే ఆయన హిందీ ప్రసంగాన్ని డీఎంకే నేత టీఆర్ బాలు అర్ధం చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో దానిని అనువాదం చేయాలని ఎదురుగా కూర్చొన్న ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝాకు సైగ చేశారు.
హిందీ ప్రసంగాన్ని అనువదించేందుకు నితీశ్ కుమార్ అనుమతిని మనోజ్ కోరారు. ఈ నేపథ్యంలో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘మన దేశాన్ని హిందుస్థాన్ అని పిలుస్తాం. హిందీని మన జాతీయ భాష అని వ్యవహరిస్తాం. మనకు ఆ భాష తెలిసి ఉండాలి’ అంటూ నితీశ్ అసహనం వ్యక్తం చేశారు. అలాగే తన హిందీ ప్రసంగాన్ని అనువదించవద్దని మనోజ్తో చెప్పారు. దీంతో నితీశ్ వ్యాఖ్యలు కాస్తా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.
More Stories
వీసీల నియామకంపై రాహుల్ వాఖ్యాలపై విద్యావేత్తల ఆగ్రహం
ఎన్నికల వేళ అయోధ్యలో మోదీ రామయ్య దర్శనం
ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీస్