మాజీ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు

మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై శామీర్ పేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు మేరకు 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 47 ఎకరాల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. 
ఎన్నికలు జరగుతున్న సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు.
మల్లారెడ్డికి సహకరించిన ఎమ్మార్వో పైనా ఫిర్యాదు చేయటంతో నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు ఆరుగురిపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మల్కాజిరి జిల్లా చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వే నెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల ఎస్టీ (లంబాడీల) వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి, కుట్రతో మోసగించి భూమిని కాజేశారని శామీర్‌పేట పోలీస్టేషన్‌లో కేతావత్ బిక్షపతి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. 
 
ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు.  మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని అనుచరులు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
వారి ఫిర్యాదు మేరకు మంత్రితో పాటు ఆరుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, 420 చీటీంగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శామీర్ పేట ఎమ్మార్వో పాత్రపైనా ఆరా తీస్తున్నట్లు చెప్పారు.