తెలంగాణాలో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్

తెలంగాణలో మరికొన్ని నెలల్లో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయటం ఖామమని మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్ భరోసా వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, తప్పుడు ప్రచారాలు చేసినా బీజేపీని తెలంగాణ ప్రజలు 8 స్థానాల్లో గెలిచారని తెలిపారు.  బీజేపీకీ ఓట్లు, సీట్లు పెంచేందుకు కృషి చేసిన ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకు ఈటల ధన్యవాదాలు చెప్పారు.

బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని చెబుతూ అందుకు నిదర్శనమే ఈసారి సీట్లతో పాటు ఓటింగ్ శాతం కూడా పెరగటం అని పేర్కొన్నారు. గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 4 నాలుగు స్థానాల్లోనే గెలిచిన బీజేపీ ఈసారి వచ్చే ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. బిజెపి 2018లో 6 శాతం, 2023లో 17 శాతం ఓట్లు సాధించిదని చెబుతూ తెలంగాణలో రాబోయే రోజుల్లో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

 ప్రధాని నరేంద్ర మోదీ గత తొమ్మిదేళ్ల పాటు భద్రత, భరోసానే కాదు ప్రపంచవ్యాప్తంగా భారత దేశ గొప్పతనాన్ని చాటారని రాజేందర్ కొనియాడారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఈటల గుర్తు చేశారు. 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 400 స్థానాలు గెలవడమే లక్ష్యంగా మోదీ పని చేస్తున్నారని వివరించారు.  భారత ఆర్థిక వ్యవస్థ 5వస్థానంలో ఉందని, మరి కొద్ది కాలంలో మూడో స్థానంకు చేరుకుంటుందని ఆర్థికవేత్తలు సహితం చెబుతున్నారని చెప్పారు. అయోధ్యలో అందరినీ ఒప్పించి రామాలయం కట్టిస్తున్న వ్యక్తి మోదీ అని గుర్తు చేశారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసిన పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకే ఓటేస్తామని ప్రజలు తెలంగాణ వ్యాప్తంగా చెప్పారని ఆయన తెలిపారు. పైగా, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తున్నవే అని ఈటల చెప్పుకొచ్చారు. పేదలకు సొంతింటి కళ నెరవేర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు.