అధికారిక సమాచారం గత ఏడాది మాదిరేఈ సంవత్సరం కూడా 1.84 మిలియన్ హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. అయితే, పంట నష్ట తీవ్రత కూడా గత ఏడాదితో పోలిస్తే అధికంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జనవరి – ఫిబ్రవరి నెలల్లోఈ ఏడాది జనవరి-పిబ్రవరి నెలల్లో 28 రోజులు తీవ్ర ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిలో 21 రోజులు తీవ్రమైన చలిగాలులు దేశాన్ని వణికించాయి. పిడుగుపాటు ఘటనలు, భారీ వర్షాల వంటి సంఘటనలు కూడా ఉత్తర భారతంలో చోటుచేసుకున్నాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు.
జనవరి నెలలో ఎనిమిది సంవత్సరాల్లోనే అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన రోజు దక్షిణ భారతంలో నమోదైంది. ఆ రోజున సగటున 30.59 సెల్సియస్ ఉష్ణోగ్రత దక్షిణ భారతంలో నమోదైంది. ఈ నెలల్లో పంజాబ్, హర్యానా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడింది. ఆ రాష్ట్రాల్లో 15 రోజుల్లో తీవ్ర వాతావరణ సంఘటనలు చోటుచేసుకున్నాయి.
మార్చి నుండి మే వరకు, మార్చి – మే నెలల మధ్య కూడా అనేక రాష్ట్రాలో వర్షాలు, వరదలు, పిడుగుపాట్ల వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. 16 రోజులు భారీ వర్షాలు, వరదలు సంభవించగా, 79 రోజుల్లో పిడుగులు పడ్డాయి. 28 రోజులు దేశ వ్యాప్తంగా తీవ్ర వడగాల్పులు వీచాయి. ఫలితంగా దేశ వ్యాప్తంగా 321 మంది మరణించారు.
మార్చి నుండి మే నెల వరకు గత ఏడాది 10 వేల హెక్టార్లలో పంట నష్టం చోటుచేసుకోగా, ఈ ఏడాది 6 లక్షల 40 వేల హెక్టార్లలో నష్టం జరిగింది. భారీ వర్షాలు, వరదల ప్రభావం మహారాష్ట్ర, రాజస్తాన్లపై తీవ్రంగా పడింది. జూన్ నుండి సెప్టంబర్ వరకు వరకు దేశ వ్యాప్తంగా 122 తీవ్ర వాతావరణ సంఘటనలు నమోదైనాయి.
వీటిలో 115 రోజుల్లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. వీటి బారిన పడి దేశవ్యాప్తంగా 2,594 మంది మరణించారు. 2022లో ఈ కాలంలో తీవ్ర వాతావరణ సంఘటనల కారణంగా 2,431 మంది మరణించారు. రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, సీజన్ ప్రారంభంలోనే వచ్చిన బిపర్ జారు తుపాన్ పశ్చిమ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. జులై నెలల్లో హిమాచల్ ప్రదేశలో అకస్మిక వరదలు చోటుచేసుకున్నాయి.
కాగా, ఆంధ్రప్రదేశ్లో జనవరి నుండి సెప్టెంబర్ 30వ తేది వరకు 273 రోజుల్లో 45 తీవ్ర వాతావరణ ఘటనలు చోటుచేసుకోగా, తెలంగాణలో వీటి సంఖ్య 52గా నమోదైంది. వీటికారణంగా ఆంధ్రప్రదేశ్లో 45 మంది మరణించగా, తెలంగాణలో 33 మంది మృతి చెందారు. తెలంగాణలో 62,811 హెక్టార్లలో పంట నష్టం సంభవించగా, ఆంధ్రప్రదేశ్లో 9015 హెక్టార్ల నష్టం వాటిల్లింది.
More Stories
చదువుల్ని లోకకల్యాణం కోసం ఉపయోగించాలి
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్