‘టిప్పు నిజస్వరూపం’ పుస్తకావిష్కరణ సభ సంవిత్ ప్రకాశన్ – సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్ (దక్షిణాపథ స్టడీస్) సంయుక్త ఆధ్వర్యంలో భాగ్యనగరంలో జరిగింది. గజానన్ భాస్కర్ మహందలే ఆంగ్లంలో రచించి
ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ-శ్రేష్ఠ సంస్థ అధ్యక్షులు, భూగర్భ జలాల నిపుణులు డాక్టర్ నర్రా భూపతి రెడ్డి ప్రసంగిస్తూ, దురదృష్టవశాత్తు మన సమాజానికి దాని అద్భుతమైన గతం గురించి, శత్రువుల గురించి తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశంపై దాడి చేసి ఆక్రమించిన ఎడారి మతాలు సమాజాన్ని నాశనం చేశాయని, యుద్ధనీతి అనేది ఏమాత్రం లేకుండా ఇక్కడి స్త్రీలపై అత్యాచారాలు చేసి చిన్న పిల్లలు చంపారని వివరించారు. ఇక్కడి సాంస్కృతిక కళలు, శాస్త్రాలు నాశనం చేయబడి, దేవాలయాలు కూల్చివేతకు గురై అపవిత్రం అయ్యాయన్నారు. ఈక్రమంలోనే `కులతత్వం’ వంటి సామాజిక దురాచారాలు సృష్టించబడ్డాయని తెలిపారు.
గూడా హేమలత తన ప్రసంగంలో, రచయిత గజానన్ మహందలే తన లోతైన పరిశోధన ద్వారా వాస్తవాలను పుస్తకరూపంలోకి ఎలా తీసుకొచ్చారో వివరించారు. అమాయక హిందువులపై నిరంకుశుడు టిప్పు సుల్తాన్ చేసిన అకృత్యాలు, వారిని దోచుకుని, వ్యవసాయ వాణిజ్యాలను నాశనం చేయడం గురించి పుస్తకం వివరిస్తుందన్నారు. రాజాధికారంతో టిప్పు సుల్తాన్ హిందూ స్త్రీలు, పిల్లలపై వర్ణించలేని దారుణాలకు పాల్పడ్డాడని, అనేక దేవాలయాలను ధ్వంసం చేశాడని
నకిలీ-సెక్యులర్ రచయితలు, చరిత్రకారులు అతని భయంకరమైన నేరాలను ఏమాత్రం కనీసం ప్రస్తావించకుండా అతడినొక స్వాతంత్ర్య సమరయోధుడి
గతంలో హిందువులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ
టిప్పు సుల్తాన్ మాత్రమే కాదు, అతని తండ్రి హైదర్ అలీ కూడా పెద్ద నిరంకుశుడని, హిందూ దేవాలయాలను ధ్వంసం చేసేవా
సంవిత్ ప్రకాశన్ సంస్థ డైరెక్టర్ పి. శైలజ మాట్లాడుతూ, తక్కువ సమయంలో ప్రచురణ సంస్థ చాలా ప్రాముఖ్యత, విలువ కలిగిన సుమారు 30 శీర్షికలను ప్రచురించిందని అన్నారు. ప్రస్తుత పుస్తక రచయిత మహందలే గతంలో రాసిన ‘ఛత్రపతి శివాజీ సేవియర్ ఆఫ్ హిందూ ఇండియా’ అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువదించి ప్రచురించామన్నారు. సంవిత్ ప్రకాశన్ వారు చరిత్ర మరచిన, వక్రీకరణకు గురైన, విస్మరించబడిన ముఖ్యమైన అధ్యాయాలను క్రమపద్ధతిలో వెలికితీస్తోందని, విలువైన కంటెంట్తో కూడిన ప్రచురణల పరంపరతో ముందుకు వచ్చిందని అన్నారు. ‘ఆఖరు ప్రవక్త అతని మతం’, ‘ఖిలాఫత్’, ‘బెంగాల్ బ్లీడింగ్’, ‘గోవా ఇంక్విజిషన్’, ‘మతం పేరుతో అక్రమాలు – న్యాయ పోరాటానికి మార్గాలు’ ఇంకా అనేక పుస్తకాలతో పాటు హైదరాబాద్లో నిజాంల పాలనపై మూడు శీర్షికలు సంవిత్ ప్రకాశన్ ద్వారా ప్రచురించబడ్డాయని అన్నారు. `శివస్య కులం’, `శివ భారతం’ `చార్వాకం’ వంటి అత్యంత ముఖ్యమైన పరిశోధనాత్మక పుస్తకాలను కూడా సంవిత్ ప్రకాశన్ ప్రచురించిందన్నారు. వీటితో పాటు కొన్ని ముఖ్యమైన అనువాద రచనలు `గంగలో విషనాగులు’, ‘ఇస్లాం అంతరంగం’ మొదలైనవి కూడా ఉన్నాయన్నారు. మరింత సమాచారం కోసం https://samvitprakashan.
More Stories
చదువుల్ని లోకకల్యాణం కోసం ఉపయోగించాలి
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
చిక్కుల్లో వినోద్ కుమార్ నామినేషన్