మరో 12 మంది అభ్యర్థులను ప్రకటించిన బిజెపి

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి 12 మంది అభ్యర్థులతో బిజెపి నాలుగో జాబితా విడుదల చేసింది. ఇప్పటికే మూడు జాబితాలలో 88 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాతో 100మంది అభ్యర్థులను ఇప్పటి వరకు బీజేపీ ప్రకటించింది. తెలంగాణలో ఇంకా 19మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
వీటిలో కొన్ని స్థానాల నుంచి జనసేన పోటీ చేయనుంది. జనసేన కోరిన స్థానాలను ఆ పార్టీకి కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఒకటి రెండు రోజుల్లో జనసేన పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శేరిలింగంపల్లి, తాండూరు, నాగర్‌కర్నూల్, కోదాడ, కొత్తగూడెం,కూకట్‌పల్లి వంటి స్థానాలను పెండింగ్‌లో పెట్టడంతో వాటిని జనసేనకు ప్రకటిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. శేరిలింగంపల్లి స్థానాన్ని బీజేపీకి కేటాయించాలని డిమాండ్ ఉంది.
కాగా, చాంద్రాయణగుట్ట అభ్యర్థి అనారోగ్య కారణాలతో పోటీ నుండి విరమించుకొంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే అక్కడ కూడా మరో అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంటుంది.

నాలుగో జాబితా:

1.చెన్నూరు (ఎస్‌సి)- దుర్గం అశోక్
2.ఎల్లారెడ్డి-సుభాష్ రెడ్డి
3. వేములవాడ- తుల ఉమ
4. హుస్నాబాద్-బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి
5. సిద్దిపేట- దూది శ్రీకాంత్ రెడ్డి
6. వికారాబాద్ (ఎస్‌సి)- పెద్దింటి నవీన్ కుమార్
7. కొడంగల్ – బంతు రమేష్ కుమార్
8. గద్వాల్- బోయ శివ
9. మిర్యాలగూడ-శెడినేని శ్రీనివాస్
10.మునుగోడు-చల్లమల్ల క్రిష్ణా రెడ్డి
11. నకిరేకల్ (ఎస్‌సి)- మొగులయ్య
12. ములుగు (ఎస్‌టి)-ప్రహ్లాద్ నాయక్