కేంద్ర ప్రభుత్వం పిలుపులో భాగంగా వన్ నేషన్ వన్ నెంబర్ ‘112’ను బుధవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాష్ట్ర డిజిపి సి.వి.ఆనంద్ అధికారికంగా ప్రారంభించారు. ఇప్పటి వరకు ‘పోలీస్ కోసం 100, అగ్నిమాపక శాఖకు 101, వైద్య సేవలకు 108, ఇలా ఇప్పటి వరకు వేరు వేరుగా నెంబర్లు వినియోగించే వారని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ నేషన్ వన్ నెంబర్లో భా గంగా ఇకపై రాష్ట్రంలోని అత్యసవసర సేవలన్నీ ఒకే గొడుగు కింద 112 ద్వారా అందుబాటులోకి వచ్చాయని డిజిపి తెలిపారు.
దేశంలోనే తొలిసారి ఏఐ, మానవ వనరుల ఆధారిత 112 సేవలు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని చెబుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 112కు బాధితులు ఫోన్ చేస్తే వారి పరిష్కారానికి సిబ్బంది మానిటరింగ్ చేస్తారని చెప్పారు. ఏఐ ఆధారిత కాల్ సిస్టమ్తో రెస్పాన్స్ టైం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. అధికారులు 112కు వచ్చిన ఫిర్యాదును ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్షం చేయకూడదని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాల్ ఫిల్టరింగ్ అనే సాంకేతికతను కొత్తగా అందుబాటులోకి తీసుకోచ్చామని, ప్రతి రోజు 112 కు వచ్చే సుమారు 14 లక్షల కాల్స్ను వడపోసి, వాటిలో నిజమైన 7500 కాల్స్ను పరిష్కరిస్తున్నామని చెప్పారు. గత సాంకేతికతతో ఆపదలో ఉన్న వారి లోకేషన్ 60 శాతం మాత్రమే ఖచ్చిత్తత్వం ఉండేదని, నేడు 95 శాతం ఖచ్చితత్వంతో బాదితుల లోకేషన్ తెలిపే విధంగా సాంకేతిను అందుబాటులోకి తీసుకుచ్చామని వివరించారు.
ప్రస్తుతం ఒకే సారి 960 కాల్స్ స్వీకరించే విధంగా సాంకేతిక ఉందని, దీంతో అత్యవసర సమయాల్లో మరో 360 కాల్స్ కూడా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. నూతన వ్యవస్థ అమల్లోకి రావడంతో అత్యవసర కాల్స్ నిర్వహణలో గణనీయమైన పురోగతి సాధించినట్లు డిజిపి తెలిపారు. కాల్ స్పందన సమయం 100 సెకన్ల నుంచి 69 సెకన్లకు, డిస్పాచర్ సమయం 90 సెకన్ల నుంచి 64 సెకన్లకు మొత్తం కాల్ ప్రాసెసింగ్ సమయం 190 సెకన్ల నుంచి 133 సెకన్లకు తగ్గిందని తెలిపారు.
దీంతో దాదాపు 30 శాతం వేగం పెరిగిందని, దేశ సగటు కంటే ప్రస్తుతం తెలంగాణలో అత్యవసర స్పందన సమయం పట్టణాల్లో ఆరు నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో- 15 నిమిషాలు ఉండగా, రాష్ట్ర సగటు పది నిమిషాల 30 సెకన్లుగా ఉందని తెలిపారు. దేశ సగటు స్పందన సమయం 18 నిమిషాలు ఉండగా, తెలంగాణ దానికంటే ఎంతో మెరుగైన పనితీరుతో దేశంలో అగ్రస్థానంలో నిలుస్తోందని వివరించారు.
పోలీస్, మెడికల్, ఫైర్, ఉమెన్ సమస్యలు, హైడ్రా కోసం 112 లో అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. చైల్డ్ హెల్ప్లైన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎలక్ట్రిసిటీ, జిహెచ్ఎంసి లాంటి 18 సేవలు 112కు డయల్ చేస్తే ఫాల్ అప్ చేస్తున్నట్లు చెప్పారు.
More Stories
52 కాలేజీలు హైడ్రా కమిషనర్ సంతకాల ఫోర్జరీ!
డిఆర్డిఓ డిజైన్తో హైదరాబాదీ కంపెనీ తొలి స్వదేశీ టర్బో జెట్ ఇంజిన్
జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యం