ఇప్పుడు తొలిసారిగా ఈ రైళ్లకు ఉన్న డిమాండ్ను భారతీయ రైల్వే పర్యవేక్షించడం మొదలుపెట్టింది. ప్రయాణికుల వయస్సు, లింగం వంటి డేటాను సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ డేటా ద్వారా పలు ఆసక్తికర విషయాలు బయటకి వచ్చాయి.
తొలుత నాలుగు రూట్ల (ముంబై, గోవా, సోలాపూర్, షిరిడి)కు సంబంధించిన వన్డే భారత్ రైళ్ల డేటాను మానిటర్ చేస్తోంది భారతీయ రైల్వే. ఇవన్నీ ముంబై నుంచే మొదలవుతున్నాయి. ఈ రూట్లల్లో ఈ తరహా రైళ్లను అధికంగా వినియోగిస్తున్న వారి వయస్సు 31-45 మధ్యలో ఉందని, ఆ తర్వాత 15-30ఏళ్ల వయస్సు వారు ఉన్నారని డేటా సూచిస్తోంది.
మొత్తం మీద ఈ రూట్లలో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 13 వరకు 85,600 మంది పరుషులు, 57,838మంది మహిళలు, 26 ట్రాన్స్జెండర్లు ప్రయాణించారు. ప్రయాణికుల్లో 1-14ఏళ్ల వయస్సు వారి వాటా 5 శాతంగా ఉంది. అంతేకాకుండా, సెప్టెంబర్లో ఈ నాలుగు రూట్లల్లో వందే భారత్ రైళ్ల ఆక్యుపెన్సీ 77శాతం నుండి 101 శాతం మధ్యలో ఉండటం విశేషం.వందే భారత్ రైళ్లను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ప్రయాణికుల నెంబర్లను పెంచుకునేందుకు ఈ డేటా ఉపయోగపడుతుందని భారతీయ రైల్వే భావిస్తోంది.
“ప్రయాణికుల ఇష్టాలను తెలుసుకునేందుకు ఈ డేటా ఉపయోగపడుతుంది. భవిష్యత్తు కార్యచరణ, సేవలు, ఫుడ్ మెన్యూతో పాటు ఇతర అంశాలను పరిశీలించేందుకు భారతీయ రైల్వేకు ఈ డేటా చక్కగా యూజ్ అవుతుంది,” అని పబ్లిక్ పాలిసీ ఎనలిస్ట్ (మొబిలిటీ అండ్ ట్రాన్స్పోర్ట్) పరేశ్ రావల్ తెలిపారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రూట్లలో వందే భారత్ రైళ్లు దూసుకెళ్తున్నాయి. త్వరలోనే మరిన్ని ప్రాంతాలకు కూడా ఈ సేవలు విస్తరించనున్నాయి. ముఖ్యంగా జమ్ము- శ్రీనగర్ రూట్లో ఓ వందే భారత్ రైలును త్వరలోనే ప్రారంభించినునట్టు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవలే వెల్లడించారు. ఇతర రైళ్లతో పోల్చుకుంటే ఈ వందే భారత్ రైళ్లతో ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతోంది. అందుకే ధరలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రజలు ఈ ఆధునిక రైళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు!
More Stories
14 ఉత్పత్తుల పతంజలి లైసెన్స్ రద్దు
జులైలో వందే మెట్రో రైల్ ట్రయల్ రన్!
బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్