
బందీలను హమాస్ ఉగ్రవాదులు విడిచిపెట్టేవరకు గాజాకు విద్యుత్, ఇంధనం, మంచినీరు సరఫరా చేసే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ ఇంధన శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ గురువారం ప్రకటించారు. ఇజ్రాయలీ బందీలు తమ ఇళ్లకు తిరిగివచ్చే వరకు వరకు గాజాలో కరెంట్ స్విచ్ నొక్కే అవకాశం లేదు, మంచినీటి నల్లాలు తిప్పే అవసరం రాదు, ఏ ఇంధనం ట్రక్కు అక్కడకు ప్రవేశించదు అంటూ ఎక్స్లో రాసిన పోస్టులో ఇజ్రాయెల్ మంత్రి స్పష్టం చేశారు.
మానవత్వానికి ప్రతిగా మానవత్వం ఉంటుంది..మాకు ఎవరూ నీతులు చెప్పనక్కర్లేదు అంటూ ఆయన ఘాటుగా జవాబిచ్చారు. ఇజ్రాయెలీ అధికారులు తెలిపిన ప్రకారం అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు దాదాపు 150 మంది ఇజ్రాయెలీలను గాజాలో బందీలుగా చేసుకున్నారు.
ఇందుకు ప్రతీకారంగా గాజాను దిగ్బంధిస్తున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ సోమవారం ప్రకటించారు. గాజాకు విద్యుత్, ఆహారం, మంచినీరు, ఇంధన సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇంధన కొరత కారణంగా గాజాలోని ఏకైక విద్యుత్ స్టేషన్ బుధవారం నుంచి పనిచేయడం ఆగిపోయింది.
గాజా స్ట్రిప్పై ఇజ్రాయిల్ రక్షణ దళాలు చేసిన దాడిలో 1203 మంది పాలస్తీనియన్లు మృతిచెందినట్లు హమాస్ గ్రూపు పేర్కొన్నది. ఆ దాడిలో సుమారు ఆరు వేల మంది గాయపడినట్లు హమాస్కు చెందిన ఆరోగ్యశాఖ తెలిపింది. మరో వైపు ఇజ్రాయిల్ భూభాగంలో ఉన్న సుమారు 1500 మంది పాలస్తీనా ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) పేర్కొన్నది.
40 మంది చిన్నారుల్నినరికివేసిన హమాస్
మరోవంక, హమాస్ మారణహోమం సృష్టిస్తోంది. వేలాది మంది ఇజ్రాయిల్ ప్రజల్ని చంపేస్తోంది. కిబుజిమ్లో హమాస్ ఫైటర్లు బీభత్సం సృష్టించారు. మహిళలు, చిన్నారులు, పసిపిల్లలు, వృద్ధుల్ని అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల తరహాలో హమాస్ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు.
కిబుజిమ్లో సుమారు 40 మంది చిన్నారుల్ని హమాస్ నరికివేసినట్లు ఐడిఎఫ్ పేర్కొన్నాయి. పసి పిల్లలను చంపేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, హమాస్ ఇలాంటి దాడులకు పాల్పడుతుందని తొలుత నమ్మలేదని, కానీ సాక్ష్యులు చెబుతున్న విషయాలు భయానకంగా ఉన్నట్లు ఐడీఎఫ్ ప్రతినిధి జోనాథన్ కన్రికస్ తెలిపారు. మహిళలు, చిన్నారుల చేతులకు సంకెళ్లు వేసి నరికివేస్తున్నారని ఆయన చెప్పారు. హమాస్ క్రూరత్వానికి ప్రపంచానికి చూపేందుకు.. కిబుజిమ్ ప్రాంతానికి అంతర్జాతీయ జర్నలిస్టులను తీసుకువెళ్లారు.
హమాస్ విమాన నిఘా వ్యవస్థ ధ్వంసం
More Stories
బిజెపిపై విషం కక్కడమే వారి అజెండా!
నియోజకవర్గాల పునర్విభజనను 25 ఏళ్లపాటు వాయిదా
ఎఐ 90 శాతం కోడ్ను రాస్తుంది