అదే ఆసియా క్రీడల్ తన అనుమతి లేకుండా చొక్కాను పైకెత్తి, ఆమె నడుమును బ్రిజ్ భూషణ్ అసభ్యకరంగా తాకాడని ఓ మహిళ రెజ్లర్ ఫిర్యాదు చేసిన విషయాన్ని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ రెండు ఘటనల్ని బట్టి చూస్తే తాను చేస్తున్న చర్యల పట్ల బ్రిజ్ భూషణ్ పూర్తి అవగాహనతో ఉన్నాడని విషయం స్పష్టం అవుతుందని అధికారులు కోర్టుకు వెల్లడించారు.
ఢిల్లీలోని డబ్ల్యుఎఫ్ఐ కార్యాలయం నుంచి వచ్చిన ఆరోపణల్ని సైతం ప్రస్తావించారు. గతంలోనూ బ్రిజ్ భూషణ్పై మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీ, అతడిని నిర్దోషిగా ప్రకటించలేదని కూడా కోర్టుకు తెలిపారు. అయితే ఆ రిపోర్ట్ను బయటపెట్టలేదు. ఈ కేసుని విచారిస్తున్న ఢిల్లీ పోలీసులకు ఒక కాపీని అందించారు.
ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలావుండగా, బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక ఆరోపణలకు పాల్పడ్డారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రముఖ రెజ్లర్లు ఆమధ్య ఢిల్లీలో నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల పాటు వాళ్లు ఆందోళన చేయడంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని, విచారణ చేయడం మొదలుపెట్టారు.
ఓ మైనర్తో కలిపి మొత్తం ఏడుగురు మహిళా రెజ్లర్లు ఆయనపై ఫిర్యాదు చేశారు. తాను ఏ తప్పు చేయలేదని ఇన్నాళ్లూ బ్రిజ్ భూషణ్ నాటకమాడాడు. అయితే.. విచారణలో భాగంగా అతని చీకటి కోణాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు పోలీసులు కొన్ని కీలక ఆధారాల్ని సేకరించినట్టు తెలిసింది.
More Stories
ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు
కేజ్రీవాల్ జైలులో పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు
బెంగళూరులో సగం మంది ఓటర్లు ఇంటికే పరిమితం