ఓటర్‌ నమోదుకు రేపటితో ముగియ‌నున్న‌ గడువు

శాసనసభ ఎన్నికల కోసం తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం తుది దశకు చేరుకున్నది. ప్రతి ఏటా ఒక విడత ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపడుతుండగా, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాదిలో రెండో విడత కూడా చేపట్టారు. రెండో విడత ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 21న ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించారు. 

రాష్ట్రంలో ఓటర్లు 3.6 కోట్లకు చేరువయ్యారు. ప్రత్యేక సవరణ తర్వాత ఓటర్ల సంఖ్య పెరగనుందని అంచనా వేస్తున్నారు. ఇందులో పురుషులు 1.53కోట్లు, మహిళా ఓటర్లు 1.52కోట్లుగా ఉన్నారు. వీరిలో 18-19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 4.76లక్షలుకాగా, ట్రాన్స్‌ జెండర్లు 2133, ఎన్నారైలు 2742, సర్వీస్‌ ఓటర్లు 15337మంది ఉన్నారు. 

మరోసారి ఓటర్ల జాబితా వార్షిక ప్రత్యేక సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్‌ 4న తుది జాబితా వెల్లడించనున్నారు. 2023 జనవరి 1నాటికి 18ఏళ్లు నిండిన పౌరులందరికీ ఓటర్లుగా నమోదు చేసుకునేలా ఈసీ చర్యలు ఆరంభించింది.

దరఖాస్తుల స్వీకరణ తర్వాత బూత్‌ లెవల్‌నుంచి పరిశీలన కొనసాగిస్తారు. పేర్లు లేకపోయినా, గల్లంతైనా మళ్లి ఫారం-6 సమర్పించి ఓటరుగా పేరు నమోదు చేసుకోవచ్చని ఈసి పిలుపునిచ్చింది. మొత్తం అభ్యంతరాలు, దరఖాస్తులు స్వీకరించి పరిశీలించేందుకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత అనుబంధ ఓటర్ల జాబితాను, అక్టోబర్‌ 4న తుది ఓటర్ల జాబితాను ఈసీ ప్రచురించనుంది. 

ముసాయిదా ప్రకటన వరకు అధికారుల వద్ద లక్షా 91 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌ లో ఉన్నాయి. వాటిని కలిపితే ఇప్పటి వరకు మొత్తం 18 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో కొత్తగా ఓటు-హక్కు నమోదు కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్య తొమ్మిది లక్షలకు పైగా ఉంది. జాబితాలో పేర్ల తొలగింపునకు సంబంధించి మూడున్నర లక్షల వరకు దరఖాస్తులు అందాయి.

ఇక చిరునామా మార్పు, ఓటర్లు బదలాయింపు, సవరణలకు సంబంధించి ఐదున్నర లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించేలా అధికారులు ఇప్పటికే కసరత్తు కొనసాగిస్తున్నారు. జాబితాలో పేర్ల తొలగింపునకు సంబంధించి మూడున్నర లక్షల వరకు దరఖాస్తులు అందాయి. 

ఇక చిరునామా మార్పు, ఓటర్లు బదలాయింపు, సవరణలకు సంబంధించి ఐదున్నర లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి.  వచ్చిన అన్ని దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ లోపు పరిష్కరించాల్సి ఉంది. ఆ తర్వాత సిద్ధమైన జాబితాను పూర్తి స్థాయిలో పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో అక్టోబర్‌ 4న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ఆ ఓటరు జాబితా ప్రకారమే శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తారు.