
అయితే ఆ సంస్థకు ఎటువంటి మతపరమైన ఉద్దేశాన్ని కట్టబెట్టవద్దు అన్న ఆలోచనతో దానికి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. కానీ ప్రజా ఉద్యమంగా చూపించాలన్న ఉద్దేశంతో ఆ పేరును నిర్ణయించారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిఘా నుంచి దూరంగా ఉండేందుకు కూడా ఈ ఎత్తు వేసినట్లు తెలుస్తోంది.
లష్కరేతోయిబా, జైషే మహమ్మద్ సంస్థలకు మతపరమైన కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఆ లింకలను పాకిస్థాన్ ఇష్టపడడం లేదు. కానీ కశ్మీర్లో తీవ్రవాదం స్థానికత అంశంగా చిత్రీకరించాలన్న ఉద్దేశంతో ఈ పేరు పెట్టినట్లు భావిస్తున్నారు. పాకిస్తాన్లో ఉగ్ర కలాపాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పారిస్కు చెందిన ఎఫ్ఏటీఎఫ్ ఆ దేశంపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
ఉగ్రవాద సంస్థలకు ఫైనాన్సింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆ ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు కొత్త పేర్లతో ఎత్తులు వేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2020 జనవరి నుంచి కశ్మీర్లో జరుగుతున్న దాడులకు తామే బాధ్యులమని టీఆర్ఎఫ్ చెబుతోంది. సాజిద్ జాట్, సజ్జద్ గుల్, సలీమ్ రెహ్మని లాంటి వారు దీంట్లో నేతలుగా ఉన్నారు.
వీళ్లంతా ఒకప్పుడు లష్కరే తీవ్రవాదులు. లష్కరేతో పాటు ఇతర ఉగ్ర గూపుల నుంచి దృష్టి మళ్లించేందుకు తాజా దాడుల్ని తాము చేస్తున్నట్లు టీఆర్ఎఫ్ చెప్పుకుంటోందని వాదనలు వినిపిస్తున్నాయి. మరోవంక, అనంత్నాగ్లో భద్రతా దళాలు ఇంకా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. కోకెర్నాగ్ ఏరియాలో భారీ స్థాయిలో దళాలు మోహరించాయి. అయితే శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో గాయపడ్డ ఓ సైనికుడు మృతిచెందాడు. దీంతో అనంత్నాగ్ ఎన్కౌంటర్ మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.
కోకెర్నాగ్ ప్రాంతంలో సుమారు ముగ్గురు ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. గారోల్ గ్రామంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు మొదలుపెట్టాయి. హీరన్ డ్రోన్లతో పాటు క్వాడ్కాప్టర్లను .. నిఘా కోసం రంగంలోకి దింపారు. ఉగ్రవాదులు జరిపిన ఫైరింగ్లో ఓ కల్నల్ అక్కడిక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడి ఆ తర్వాత హాస్పిటల్లో మృతిచెందారు.
More Stories
భారత్ కు బాసటగా శ్రీలంక.. ప్రధాని ట్రూడోపై మండిపాటు
కెనడాలో రెచ్చిపోతున్న ఖలిస్థానీ వేర్పాటువాదులు
కాంగ్రెస్ ను నడిపిస్తున్న `అర్బన్ నక్సల్స్’