గోషామహల్ ట్రాఫిక్ ఎసిపి కార్యాలయం సమీపంలోని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, మొక్కలు నాటారు అనంతరం దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహనీయులను గుర్తు చేస్తూ వారి నుంచి స్ఫూర్తి పొందుతూ స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అక్కడినుంచి ఇంటింటికీ తిరుగుతూ మట్టిని సేకరిస్తూ గోషామహల్ లోని ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు వందేమాతరం రామచందర్ రావు నివాసం వరకు కొనసాగారు.
వందేమాతరం రామచంద్రరావు నివాసం దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబసభ్యుల్ని సన్మానించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు త్యాగాన్ని, వారి పోరాట స్ఫూర్తిని, వారి సేవల్ని కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మనం గతేడాది, ఈ ఏడాది ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని అందరి భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించుకున్నమని చెబుతూ దీంట్లో భాగంగానే ఈసారి ‘మేరీ మాటీ మేరా దేశ్’ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.
2. వలసవాద ఆలోచనలనుంచి విముక్తి
3. ఘనమైన భారతదేశ సంస్కృతి, వారసత్వాలను ప్రోత్సహిస్తాను, ప్రచారం చేస్తాను.
4. దేశ ఐకమత్యం, సార్వభౌమత్వం కోసం నిరంతర కృషి చేస్తాను.
5. దేశ రక్షణకోసం, దేశాభివృద్ధికోసం త్యాగాలు చేసిన వారందరినీ గుర్తుచేసుకుని, గౌరవించడం బాధ్యతగా స్వీకరిస్తాను.
ఈ శిలాఫలకాల వద్ద సెల్ఫీలు తీసుకుని..మేరీ మాటీ మేరాదేశ్ వెబ్సైట్లో పోస్టు చేయాలని కోరారు. మన పెద్దల ధైర్య సాహసాలను, శౌర్య ప్రతాపాలను, త్యాగాన్ని, మన దేశపు పవిత్రమైన మట్టి గొప్పదనాన్ని స్మరించుకుంటూ ఈ ‘మేరీ మాటీ మేరా దేశ్’ కార్యక్రమం జరుపుకుంటున్నామని వివరించారు.
ఈ మట్టి ని సేకరించి డిల్లీ వేదికగా 75 వేల మొక్కలు నాటి మహనీయుల త్యాగల్ని స్మరించుకునేలా వారి నుంచి స్ఫూర్తి పొందెందుకు అమృత వనం డిల్లీలో ఏర్పాటు చేయబోతున్నాం అని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇది భవిష్యత్ తరాలకు స్పూర్తి నిస్తుందని చెబుతూ ప్రధాని ఆలోచన మేరకుఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం లో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.
మన దేశ స్వాతంత్ర్య పోరాట ఘట్టాలను మొదలుకుని, నేటి అభివృద్ధి పథంలో ప్రయాణం వరకు ప్రతి అంశాన్నీ దేశ ప్రజలకు గుర్తుచేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం అని చెప్పారు.
More Stories
అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు
తెలంగాణ మంత్రివర్గ సమావేశంకు ఈసీ అనుమతి
కేజ్రీవాల్ నిరసన పిలుపుతో ఢిల్లీలో ఉద్రిక్తత