ఢిల్లీలో సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన నిరసనల్లో అర్బన్ నక్సల్స్, దేశ విద్రోహ శక్తులు చొరబడ్డాయని మాధవ్ ఆరోపించారు. ఆర్టికల్–370 రద్దును వ్యతిరేకించడం, పార్లమెంట్ దాడి కేసు నిందితుడు అఫ్జల్ గురు ఉరితీతను ప్రశ్నించడం, దేశాన్ని ముక్కలు చేస్తామంటూ నినాదాలు చేసే శక్తులకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు అండగా నిలవడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై దాడి యత్నం దేశంపైనే జరిగిన దాడిగా భావిస్తున్నామని మాధవ్ పేర్కొన్నారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల ముట్టడికి బీజేపీ పిలుపు ఇచ్చిన్నట్లు తెలిపారు. విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణులు గుడ్లతో, కర్రలతో దాడి చేయడం వారి హింసాత్మక రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.
మన్మోహన్సింగ్ ప్రభుత్వ హయాంలో 150కు పైగా పేపర్ లీకులు జరిగిన విషయాన్ని కాంగ్రెస్ మరచిపోయిందని విమర్శించారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటన వెలుగులోకి రాగానే బాధ్యులపై మోదీ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని అరెస్టులు చేసిందన్నారు. పరీక్షల నిర్వహణ పూర్తై, ర్యాంకు కార్డులు జారీ చేసి కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతోందని తెలిపారు.
రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మాధవ్ ఆరోపించారు. దేశద్రోహ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దేశ సమైక్యత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.

More Stories
గాంధీ భవన్ ముట్టడికి పిలుపు.. బిజెపి నాయకుల అరెస్ట్
ఖతార్ ఇస్లామిక్ ఉగ్రవాదానికి మూలకేంద్రం
అస్సాంలో తీవ్రరూపం దాల్చిన వరదలు… 31 మంది మృతి