చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న క్రమంలో ల్యాండర్ స్పీడ్ తగ్గుతూ వస్తుంది. ఈ సమయంలో విక్రమ్ ల్యాండర్, చంద్రుడి సర్ఫేస్కు అడ్డంగా ఉంటుంది. ఈ దశను “రఫ్ బ్రేకింగ్ ఫేజ్” అని పిలుస్తున్నారు. మొత్తం 20 నిమిషాల ప్రక్రియలో ఇదే 11 నిమిషాలు ఉంటుంది.
అక్కడి నుంచి ల్యాండర్ను ఉపరితలానికి వర్టికల్గా మారుస్తారు శాస్త్రవేత్తలు. ఇక్కడి నుంచి “ఫైన్ బ్రేకింగ్ ఫేజ్” మొదలవుతుంది. వాస్తవానికి ఫైన్ బ్రేకింగ్ దశలోనే చంద్రయాన్-2 మిషన్ విఫలమైందని చెప్పుకోవాలి. ల్యాండర్ను అదుపు చేయడం కష్టంగా మారడంతో, అది చంద్రుడిపై కూలిపోయింది. ఈసారి అలా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఇస్రో చెబుతోంది.
చంద్రుడి ఉపరితలానికి 800 మీటర్ల ఎత్తులో ల్యాండర్ వేగం దాదాపు సున్నాకు చేరుకుంటుంది. ఆ తర్వాత ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తుంది. అప్పటికి కూడా రెండు ఇంజిన్లు ఫైర్ అవుతూనే ఉంటాయి. వాటి సాయంతోనే చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టేందుకు విక్రమ్ ప్రయత్నిస్తుంది. ల్యాండర్ కాళ్లల్లోని సెన్సార్లు ఉపరితలంపై దిగినప్పుడు ఇంజిన్లు ఆఫ్ అవుతాయి.
ఫలితంగా 20 నిమిషాల ప్రక్రియ పూర్తవుతుంది. ల్యాండింగ్ ప్రక్రియ కారణంగా ఉపరితలంపై దుమ్ము ఎగిసిపడుతుంది. ఈ దుమ్మును రెగోలిథ్ అని పిలుస్తున్నారు. ఇది సెటిల్ అయిన తర్వాత, కొంతసేపటికి ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకి వస్తుంది. ఈ ప్రగ్యాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టి, దాదాపు 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తుంది. అయితే.. ల్యాండ్ అయిన తర్వాత విక్రమ్ కొన్ని ఫొటోలు పంపుతుంది. వీటిని సక్సెస్ ట్రోఫీగా పరిగణించవచ్చు.
కాగా, 70 కిలోమీటర్ల దూరం నుంచి జాబిల్లి ఫొటోలను ల్యాండర్ తన కెమెరాలో బంధించింది. ఈ ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ట్విట్టర్ (ఎక్స్)లో పోస్టు చేసింది. విక్రమ్ ల్యాండర్కు అమర్చిన ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా ఈ ఫొటోలను తీసినట్లు తెలిపింది. మిషన్ షెడ్యూల్లో ఉందని.. సిస్టమ్లు క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నట్లు పేర్కొంది. సున్నితమైన సెయిలింగ్ కొనసాగుతోందని తెలిపింది
More Stories
తెలంగాణలో ‘గాడిద గుడ్డు’ పాలన
వేముల రోహిత్ దళిత్ కాదు…. కేసు మూసివేత
బిజెపి-ఎన్డిఎ తప్ప మరెవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు