భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3కి సంబంధించి కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది. భూకక్ష్యను దాటుకుంది. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రుడి గురుత్వాకర్షణ ప్రభావంలోకి పంపించడానికి చంద్రాయన్ 3 కక్ష్యను మరింత పెంచింది ఇస్రో.
శనివారం సాయంత్రం సరిగ్గా 6:59 నిమిషాలకు చంద్రుడి ఆర్బిట్లోకి ప్రవేశించింది. ఇప్పటి నుంచి చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. చంద్రుడి కక్ష్యలోకి వెళ్లేలా లూనార్ ఆర్బిట్ ఇనసర్షన్ ప్రక్రియను ఇస్రో చేపట్టింది. దీని అనంతరం మరో 18 రోజులు చంద్రుడి కక్ష్యలోనే చంద్రయాన్-3 ఆర్బిటర్ తిరగనుంది. ఇస్రో చేపట్టే ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో యావత్ దేశ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రయాన్-3 మిషన్ లో అత్యంత కీలకమైన ఘట్టం శనివారం చోటుచేసుకుంది. ఇస్రో చంద్రయాన్-3 ఆర్బిటర్ చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. భూ కక్ష్యలను పూర్తి చేసుకున్న చంద్రయాన్-3 శనివారం రాత్రి 7 గంటలకు జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. అంతరిక్ష నౌక వేగాన్ని తగ్గించిన ఇస్రో కచ్చితమైన ప్రణాళికతో ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి చంద్రయాన్-3ను విజయవంతంగా ప్రవేశపెట్టింది.
18 రోజుల పాటు చంద్రుడి చుట్టూ తిరగనున్న చంద్రయాన్-3 జాబిల్లిపై దిగనుంది. అనంతరం రోవర్ చంద్రుడిపై ల్యాండ్ అయ్యి పరిశోధనలు చేయనుంది. కిందటి నెల 14వ తేదీన తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి చంద్రయాన్ 3 నింగి వైపు దూసుకెళ్లిందిన విషయం తెలిసిందే. 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో- ఈ మూన్ మిషన్ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఇస్రో.
More Stories
రెజ్లర్ బజరంగ్ పూనియాపై సస్పెన్షన్ వేటు
ఓట్ల కోసం నిప్పుతో కాంగ్రెస్ చెలగాటం
రెండేళ్లలో పోలవరం పూర్తిచేస్తాం.. రాజధానిగా అమరావతి చేస్తాం