అధిక వర్షాలు కారణంగా ఇప్పటికే టమాట ధరలు కొండెక్కి సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో పాటు చింతపండు, వెల్లుల్లి, అల్లంతో పాటు ఇతర కూరగాయలు ధలు కూడా మండిస్తున్నాయి. తాజాగా ఉల్లి ధరలు కూడా టమాటా బాట పట్టనుందని క్రిసిల్ పరిశోధన వెల్లడించింది.
ఆగస్టు నెలాఖరు నాటికి ఉల్లి ధరలు 150 శాతం ఎగిసి కిలో రూ.60 నుంచి రూ. 70 వరకు చేరవచ్చని క్రిసిల్ పేర్కొంది. సరఫరా కూడా కష్టంగా మారితే ధరలు మరింత అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి, మార్చి 2023లలో నమోదైన అమ్మకాల కారణంగా రబీ ఉల్లిపాయల షెల్ఫ్ లైఫ్ ఒకటి నుండి రెండు నెలల వరకు తగ్గిందని తెలిపింది.
ఫలితంగా గత రబీ సీజన్లోని ఉల్లి నిల్వలు సెప్టెంబర్ కంటే ముందే ఆగస్టు నాటికే గణనీయంగా క్షీణించవచ్చని తెలిపింది. ప్రస్తుతం, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ డేటా ప్రకారం, ఢిల్లీ మార్కెట్లలో ఉల్లిపాయల రిటైల్ ధర కిలోకు సుమారు రూ.30గా ఉంది. క్రిసిల్ నివేదిక నిజమైతే, నెలాఖరు నాటికి ధరలు రెట్టింపు కావచ్చు.
అయితే దీంతోపాటు ఈ నివేదిక కొన్ని సానుకూల అంశాలను కూడా వెల్లడించింది. ఈ పెరుగుదల 2020లో కనిపించిన గరిష్ట స్థాయిల కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొంది. మరీ ముఖ్యంగా, ఖరీఫ్ పంట అక్టోబర్ నుండి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు.
అయినప్పటికీ, ఖరీఫ్ ఉల్లి పంట మార్పిడి, పంటను నిర్ణయించడంలో ఆగస్టు, సెప్టెంబర్లలో వర్షపాతం కీలక పాత్ర పోషిస్తుందని నివేదిక హెచ్చరించింది.సెప్టెంబర్లో ఉన్న అధిక ధరలతో పోలిస్తే, పండుగ నెలల్లో (అక్టోబర్-డిసెంబర్) ధరల హెచ్చుతగ్గులు స్థిరంగా ఉంటాయని అంచనా వేస్తోంది‘ అని నివేదిక స్పష్టం చేసింది. దేశంలో ఉల్లి ప్రస్తుత రిటైల్ ధరలు కిలోకు రూ. 25 వద్ద ఉన్నాయి.
ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు కూరగాయలు, పప్పులు, తృణధాన్యాల రేట్లు గరిష్ఠ ధరలు నమోదు చేశాయి. ఈ సమయంలో ఉల్లి ధరలు సాధారణంగా ఉన్నాయి. జనవరి నుంచి మే వరకు ఉల్లి తక్కువ ధరలలో లభ్యమయ్యాయి. టమాటా రేటు పెరగడం, ఉల్లికి రేటు లేకపోవడంతో ఖరీఫ్ సీజన్ లో రైతులు ఉల్లిని తక్కువగా సాగు చేశారు. దీంతో సాగు విస్తీర్ణం కూడా 8 శాతం తగ్గినట్లు తెలుస్తోంది.
ఖరీఫ్ సీజనులో ఉల్లి ఉత్పత్తి ఐదు శాతం తగ్గడంతో వార్షిక ఉత్పత్తి 29 మిలియన్ టన్నులకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది గత అయిదేళ్ల సగటు కంటే ఇది 7 శాతం అధికమని క్రిసిల్ నివేదిక తెలిపింది. ఉల్లి సరఫరాపై అంతగా ప్రభావం పడకపోవచ్చు కానీ, ఆగస్టు, సెప్టెంబరులో వర్షపాతాన్ని బట్టి ఉల్లి ధరలు ఉంటుందని క్రిసిల్ పేర్కొంది.
More Stories
బంగారం స్మగుల్డ్ చేస్తూ చిక్కిన అఫ్ఘన్ దౌత్యవేత్త
తెలంగాణలో ‘గాడిద గుడ్డు’ పాలన
వేముల రోహిత్ దళిత్ కాదు…. కేసు మూసివేత