సీఎం అశోక్ గెహ్లాట్ అక్రమ ఆర్థిక లావాదేవీలు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలకు చేసిన డబ్బు పంపిణీ వివరాలు అందులో ఉన్నాయని ఆయన ఆరోపించారు. అయితే ఈ రెడ్ డైరీ అంశాన్ని ప్రస్తావించగానే సభలో గందరగోళం నెలకొన్నది. రాజేంద్రసింగ్తో ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఘర్షణకు దిగారు.
రెడ్ డైరీ రహస్యాలను సభకు వివరించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆయన వెల్లోకి దూసుకెళ్లారు. అయితే మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించలేదని, మంత్రి శాంతికుమార్ ధరివాల్తో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనను ‘కొట్టి, తన్ని, అసెంబ్లీ నుంచి బయటకు లాగిపడేశారు’ అని రాజేంద్ర సింగ్ ఆ తర్వాత ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. మహిళలపై నేరాల్లో దేశంలోనే రాజస్థాన్ మొదటి స్థానంలో ఉందని మరోసారి ఆరోపించారు. రాజస్థాన్ కూతుర్లు, సోదరీమణులు తనను విధాన సభకు పంపించారని, మహిళల రక్షణకు పాటుపడటానని తనకు ఓట్లువేసి గెలిపించారని చెప్పారు.
సస్పెండ్ అయిన అనంతరం రాజేంద్రసింగ్ మీడియాతో మాట్లాడుతూ ‘దాదాపు 50 మంది నాపై దాడి చేశారు, కొట్టారు, తన్నారు. కాంగ్రెస్ నేతలు సభ నుంచి నన్ను బయటకు లాగిపడేశారు. రెడ్ డైరీ వివరాలు సభకు చెప్పాలని అనుకొన్నాను. మాట్లాడేందుకు కూడా స్పీకర్ అవకాశం ఇవ్వలేదు’ అంటూ మండిపడ్డారు.
‘నేను చేసిన తప్పేంటి?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్న అంశాన్ని ప్రస్తావించానని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి శాంతికుమార్ ధరివాల్ వద్దకు వెళ్లి, మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరాను. అందుకు అనుమతించని స్పీకర్ చాంబర్కు రావాలని పదేపదే చెప్పారు. అనంతరం మంత్రితో పాటు ఎమ్మెల్యేలు చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు. తీవ్రంగా కొట్టారు. డైరీలోని కొన్ని పేజీలను చించుకొని పోయారు’ అని వివరించారు.
రాజస్థాన్ మొగోళ్ల రాష్ట్రమని ఏకంగా క్యాబినెట్ మంత్రి శాంతి కుమార్ ధరివాల్ ప్రకటించినప్పుడు తప్పులేనిది మహిళ భద్రత గురించి తాను మాట్లాడితే తప్పు ఎలా అవుతుందని మాజీ మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నాయని రాజేంద్రసింగ్ అసెంబ్లీలో పేర్కొనడంతో గత వారం గంటల వ్యవధిలోనే ఆయనను సీఎం అశోక్ గెహ్లాట్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు.
More Stories
నేడు 92 స్థానాల్లో మూడో దశ ఎన్నికల పోలింగ్
ఎన్డీఏది అభివృద్ధి మంత్రం – వైసీపీది అవినీతి తంత్రం
కేజ్రీవాల్పై ఎన్ఐఏ దర్యాప్తునకు ఎల్జీ సక్సేనా సిఫార్సు