
బెంగాల్లో ఇద్దరు గిరిజన మహిళలపై జరిగిన దాడి సంఘటనపై మమతా బెనర్జీ మాట్లాడకపోవడాన్ని మాల్వీయ తప్పుపట్టారు. ఈ ఘటనను ఆమె ఖండించడం కాని, ఆవేదన వ్యక్తం చేయడం కాని చేయలేదని, అలా చేస్తే ముఖ్యమంత్రిగా తన వైఫల్యాన్ని ఒప్పుకున్నట్లు అవుతుందన్న కారణంతోనే ఆమె మౌనం వహిస్తున్నారని మాల్వీయ ఆరోపించారు.
బెంగాల్లో భయోత్పాతం కొనసాగుతోందని, మాల్డాలోని బంగన్గోలా పోలీసు స్టేషన్ పరిధిలోని పకువా మఠ్ ప్రాంతంలో ఇద్దరు గిరిజన మహిళలను మూకలు విస్త్రలను చేసి విచక్షణారహితంగా కొడుతూ హింసించారని మాల్వీయ తెలిపారు.
సంబంధిత ఘటన బెంగాల్లోని మాల్దా జిల్లాకు చెందిన పఖౌహట్ గ్రామంలో మూడు- నాలుగు రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు మహిళలు దొంగతనానికి పాల్పడుతున్నారన్న అనుమానంతో గ్రామస్థులు వారిని పట్టుకుని దారుణంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
అనంతరం ఆ ఇద్దరు మహిళలను అక్కడి స్థానికులు అర్ధ నగ్నంగా చేశారు. స్థానికుల్లో చాలా మంది మహిళలే ఉండటం గమనార్హం. ఆ తర్వాత వారిని కొడుతూ, ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ వీడియో చూసిన తర్వాతే తమకు ఘటన గురించి తెలిసిందని తెలిపారు.
“మా వద్దకు వచ్చి ఎవరు ఫిర్యాదు చేయలేదు. వైరల్ వీడియో చేసిన తర్వాతే మాకు ఈ విషయం గురించి తెలిసింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇద్దరు మహిళలు దొంగతనానికి పాల్పడుతుండగా దుకాణంలోని ఓ మహిళ వారిని పట్టుకుంది. అనంతరం రోడ్డు మీదకు తీసుకొచ్చింది. స్థానికులు ఆ మహిళలపై దాడి చేశారు. కొందరు మహిళలు వారిద్దరిని అర్ధ నగ్నంగా చేసి కొట్టారు. కొద్ది సేపటి తర్వాత బాధితులు అక్కడి నుంచి పారిపోయారు” అని వివరించారు.
అయితే దుకాణదారులు కూడా ఫిర్యాదు చేయలేదని పోలీస్ అధికారులు వెల్లడించారు. కాగా, ఇది దొంగతనం కేసు కావడంతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని టిఎంసి నేత, బెంగాల్ మంత్రి శశి పంజా తెలిపారు. ఇద్దరు మహిళలు మార్కెట్ నుండి ఏదో దొంగతనం చేసే ప్రయత్నం చేస్తే, కొందరు మహిళలు పట్టుకుని కొట్టారని చెబుతూ పోలీసులు ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నారని, తగు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
More Stories
కర్రెగుట్టలో చివరి ఘట్టంలో ఆపరేషన్ కగార్?
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం
ఆర్మీ హిట్ లిస్ట్ లో 14 మంది ఉగ్రవాదులు!