ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఆస్ట్రేలియాలో భారత రాయబారిగా పనిచేసిన అంబాసిడర్ ఎ. గీతేష్ శర్మ ప్రశంసించారు. జీ 20 యూనివర్శిటీ కనెక్ట్ లెక్చర్ సిరీస్ లో భాగంగా ఎంగేజింగ్ యంగ్ మైండ్స్ అనే అంశంపై శుక్రవారం ఉస్మానియా విశ్వవిద్యాలయ దూరవిద్యాకేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విదేశాలతో భారత సంబంధాల ఆవశ్యకతను వివరిస్తూ ఉక్రెయిన్, సుడాన్ సహా అనేక ప్రాంతాల్లో క్లిష్టపరిస్థితులు ఎదురైన సందర్భాల్లో భారత పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు భారత విదేశీ వ్యవహారాల విభాగం అత్యుత్తమంగా పనిచేసిందని కొనియాడారు.
కాలానుగుణంగా విదేశీ సంబంధాలు, దౌత్య విధానాలు మారుతూ వచ్చాయని సాంకేతిక యుగంలో ప్రపంచం మరింత ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. సంఘర్షలు లేని ప్రపంచాన్ని స్వప్నించే ప్రతి దేశం భారత్ వైపు చూస్తోందని పేర్కొంటూ పపంచానికి శాంతిని అందించటంలో నాయకత్వం వహించేది భారత్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
ఓయూ జి-20 యూనివర్శిటీ కనెక్ట్కు వేదికగా ఎంపిక చేసిన ఆర్ఎస్ఐ అధికారులకు ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరిచేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇండో-పసిఫిక్ అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ వి. ప్రవీణ్ రావు ప్రసంగిస్తూ దేశ ప్రజలకు అవసరమైన ఆహార ఉత్పత్తిలో సాధికారత సాధించామని చెప్పారు. దేశంలోని పరిశోధనల ఫలితంగా వెనకబడిన దేశాలకు సైతం ఆహారాన్ని అందించే స్థాయికి ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇతర హక్కులతో పాటు, ‘భూమి హక్కు‘, ‘ఆహార హక్కు‘ చట్టాలు చేయవలసిన అవసరాన్ని ప్రస్తావించారు వ్యవసాయం, వాతావరణం, డాటాసైన్స్, కృత్రిమ మేధ ఇలా అన్ని విభాగాలు ఏకతాటిపైకి వచ్చినప్పుడు అభివృద్ధి సాధ్యమని చెబుతూ అందుకే అన్ని అంశాలు అందుబాటులో ఉండే విద్యావిధానానికి భవిష్యత్తు ఉందని తెలిపారు.
More Stories
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ వారే
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు
తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు