ఖలిస్థాన్ వేర్పాటువాదులు టొరంటో, వాంకోవర్ నగరాల్లో నిరసనల సందర్భంగా భారత దేశ జాతీయ పతాకాన్ని తగులబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. అమెరికాలోని ప్రకటిత ఉగ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ ఈ నిరసనలను నిర్వహిస్తోంది. ఈ సంస్థకు ప్రధాన అనుబంధ సంస్థ కెనడాలో ఉంది.
ఈ సంస్థకు చెందిన నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ను కెనడాలోని వాంకోవర్లో జూన్ 19న హత్య చేశారు. ఇంటర్ గ్యాంగ్ ఘర్షణలో ఈ హత్య జరిగినప్పటికీ, ఇది భారత దేశ అధికారుల పనేనని ఎస్ఎఫ్జే ఆరోపిస్తూ, సిక్కు యువతను రాడికలైజ్ చేస్తోంది. పాశ్చాత్య దేశాల్లోని భారతీయ మూలాలుగలవారిపైకి వీరిని ఉసిగొలుపుతోంది.
నిజ్జర్ హత్యకు కారకులు ఇండియన్ హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, వాంకోవర్ కాన్సుల్ జనరల్ మనీశ్, టొరంటో కాన్సుల్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవ అని కరపత్రాలను పంచుతోంది. ఎస్ఎఫ్జే ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను కార్యకలాపాల్లో భాగంగానే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్పై దాడి జరిగింది.
ఈ ఉగ్రవాదికి కెనడా, యూకే తదితర పాశ్చాత్య దేశాల్లో ప్రాపకం లభిస్తోంది. అక్కడి ప్రభుత్వాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయి. ఇండియన్ హై కమిషనర్కు, ఇద్దరు కాన్సుల్ జనరల్స్కు భద్రత కల్పించాలని కెనడాలోని ఇండియన్ హై కమిషన్ ఆ దేశ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. ముప్పు తీవ్రత తగ్గే వరకు, ముఖ్యంగా ఈ అధికారులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేటపుడు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కోరారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందుగా హెచ్చరిస్తున్నప్పటికీ కెనడా, బ్రిటన్, అమెరికా ప్రభుత్వాలు సిక్కు ఉగ్రవాదుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. వారికి నిరసన తెలిపే హక్కు ఉందని చెప్తున్నాయి. అయితే జూలై ఎనిమిదిన జరిగే నిరసనల్లో భారత దేశ జాతీయ పతాకాన్ని అవమానించినా, తగులబెట్టినా తీవ్రంగా పరిగణించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
More Stories
మిల్లర్ల నుండి ఉత్తమ్ రూ 500 కోట్లు వసూలు!
పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యే
లోక్సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలుస్తుంది