గో అక్రమ రవాణాపై చర్యలకు డిజిపి హామీ

తెలంగాణాలో గోవుల అక్రమ రవాణా పై చట్టపరమైన చర్యలు తీసుకొనేలా అధికారులను ఆదేశిస్తానని డిజిపి అంజనీ కుమార్ విశ్వహిందూ పరిషత్ ప్రతినిధివర్గానికి హామీ ఇచ్చారు. భాగ్యనగరంలోని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలను పకడ్బందీగా గోరక్షణ చేయాలని సూచిస్తానని డిజిపి చెప్పారు.
రాష్ట్రంలో గో నిషేధ చట్టాలు ఏమాత్రం అమలు కావడం లేదని, ఇష్టారాజ్యంగా  వధించేందుకు గోవులను తరలిస్తున్నారని పేర్కొంటూ   గోహత్య నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయాలని పరిషత్   డిమాండ్ చేసింది. సోమవారం సాయంత్రం రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ గారిని కలిసిపరిషత్ బృందం కలిసి వినతిపత్రం సమర్పించింది.
 
చట్ట విరుద్ధంగా గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. గోవులను తరలిస్తున్న వారి వివరాలను పోలీసులకు తెలుపుతున్న బజరంగ్ దళ్ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారని, చేయడం చట్ట విరుద్దమని డీజీపీ దృష్టికి తీసుకు వెళ్ళింది. కబేలాలకు తరలిస్తున్న గోవుల విషయాలను పోలీసులకు తెలియజేస్తున్న కార్యకర్తలపై పోలీసులు బెదిరింపులకు దిగడం సమంజసం కాదని సూచించింది.
 
కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసేలా కారణంగా భజరంగ్ దళ్ కార్యకర్తలను బైండోవర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కేసులు పెట్టి వేధింపులకు దిగడం పై స్పందించి పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల తో పాటు ముఖ్యంగా భాగ్యనగర్ శివారు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వద్ద ఎంఐఎం నేతలు పోలీసులకు దంకీ ఇస్తున్నారని తెలిపారు.
చుట్టాలను ఉల్లంగించి పోలీసులపై దుర్భాషలాడుతున్న కూడా పట్టించుకోవడంలేదని వివరించారు. అక్రమంగా తరలిస్తున్న గోవులను నిలిపివేయడంతో, పోలీసులను బెదిరించి  వాటిని తరలించుకు వెళ్తున్నారని సూచించారు. ఇలాంటి వ్యవహారంలో ఎంఐఎం కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు నేరుగా భయభ్రాంతులకు గురి చేస్తూ దౌర్జన్యానికి దిగుతున్నారని చెప్పారు.

పట్టుకున్న ఆవులను వెంటనే గోశాలలకు పంపించాలని, చట్ట విరుద్ధంగా తరలిస్తున్న వారిపై  కేసులు నమోదు చేయాలని సూచించారు. గోరక్షణ కోసం అనేక చట్టాలు ఉన్న కూడా వాటిని అమలు చేయకపోవడం దౌర్భాగ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు. డిజిపిని కలిసిన వారిలో వి పరిషత్ రాష్ట్ర సహ కార్య దర్శి భాను ప్రకాష్, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, రాష్ట్ర బజరంగ్ దళ్ ప్రముఖ్ శివ రాములు, న్యాయవిభాగం ప్రముఖ్ శివ ప్రసాద్ ఉన్నారు.