ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భారతదేశం సురక్షితంగా ఉందని కేంద్రం భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే తెలిపారు. సోమవారం పాలమూరు గ్రామీణ మండలం కోడూరు గ్రామంలో మండల అధ్యక్షుడు రాజుగౌడ్, కోడూరు ఎంపిటిసి ఆధ్వర్యంలో కేంద్ర పథకాల లబ్ధిదారుల సమావేశం ఏర్పాటు చేశారు.
జనసంపర్క్ అభియాన్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొంటూ ప్రధాని మోదీ వచ్చిన తర్వాత దేశ రక్షణ కోసం పని చేస్తున్న మన సైనికులకు అధునాతన ఆయుధాలు ఇచ్చి వెన్నుదన్నుగా నిలిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సమయంలో అయితే చిదంబరం లేఖలు రాసి సరిపెట్టుకునేదని ఎద్దేవా చేశారు.
ప్రధాని పేదల సంక్షేమం అభివృద్ధి అవినీతి పాలన లక్ష్యంగా పని చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో రెండు రూపాయలు ఇస్తే లబ్ధిదారునికి రెండు రూపాయలు చేరుతున్నాయని ఆయన తెలిపారు. మధ్యలో దళారీ వ్యవస్థ లేదని కొనియాడారు.
రైతులకు కిసాన్ సమాన్ నిధి కింద రూ. 5 లక్షల కోట్లు పంపిణి చేసిన్నట్లు తెలిపారు. చైనా సరిహద్దులో నాసాయి అనే గ్రామంలో ఒక మహిళా మోదీ పాలనకు ముందు కలుషిత నాలా నీళ్లు తాగేవాళ్లమని ప్రధాని మోదీ వచ్చిన తర్వాత శుద్ధ జలాలు ఇస్తున్నారని తెలిపిందని ఆయన గుర్తు చేశారు.
More Stories
బిజెపి ఎమ్యెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి
పత్తాలేని బిఆర్ఎస్…కాంగ్రెస్కు ఓటమి ఖాయం
మేడిగడ్డను పరిశీలించిన జస్టిస్ ఘోష్