అయితే, ఆయా ఫోన్లలో ఈ ఫీచర్ ఉందో లేదో తెలుసుకునేందుకు సెట్టింగ్స్ > అదనపు సెట్టింగ్స్ > సిస్టమ్ సర్వీస్లోకి చెక్ చేయాలని చెబుతున్నారు. ఇది స్మార్ట్ఫోన్ వినియోగదారుల లొకేషన్ను ట్రాక్ చేస్తోందని, ఇంటర్నెట్కు కనెక్ట్ అయిన వారి క్యాలెండర్ ఈవెంట్స్, కాల్ లాగ్లు, మెసేజ్లను సైతం రీడ్ చేయడంతో పాటు షేర్ చేసేందుకు అవకాశం ఉండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే, ఈ డేటా ప్రాథమికంగా ఛార్జింగ్ని ఆప్టిమైజ్ చేయడానికి, వాల్పేపర్లతో సహా ఫీచర్లను మెరుగుపరచడానికి సేకరించినట్లు రియల్మీ తెలిపింది. ఈ ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నది. దీనిపై దర్యాప్తు చేయాలని కేంద్ర సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆదేశించారు.
అయితే ఎన్హాన్స్డ్ ఇంటెలిజెంట్ సర్వీసెస్ ఫీచర్కు సంబంధించి రియల్మీ స్పందిస్తూ ఫీచర్తో వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచవచ్చని కంపెనీ తెలిపింది. వాస్తవానికి, ఈ ఫీచర్లో సర్వీస్, అనుభవాన్ని మెరుగుపరచడం పేరుతో స్మార్ట్ఫోన్ కంపెనీలు డివైజ్ సమాచారం, యాప్ వినియోగ డేటా, స్థానం, క్యాలెండర్ ఈవెంట్స్, సందేశాలు, మిస్డ్ కాల్ డేటా వంటి కొంత సమాచారాన్ని సేకరిస్తాయి.
More Stories
14 ఉత్పత్తుల పతంజలి లైసెన్స్ రద్దు
జులైలో వందే మెట్రో రైల్ ట్రయల్ రన్!
బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్