బ్రిజ్ భూషణ్ ఓ మైనర్ సహా ఏడుగురు రెజ్లర్లపై లైంగిక దాడి జరిపినట్లు ఆరోపణలు నమోదైన సంగతి తెలిసిందే. ఆయనపై ఢిల్లీ పోలీసులు 2 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. అంతర్జాతీయ కోచ్, రిఫరీతో పాటు పలువురు రెజ్లర్లను విచారించిన అనంతరం పోలీసులు ఛార్జిషీటును దాఖలు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్పై 25 మంది ఇచ్చిన స్టేట్మెంట్లను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు.
ఫిర్యాదుదారైన ఓ మహిళా రెజ్లర్ను ఇటీవల పోలీసులు రెజ్లింగ్ ఫెడరేషన్ కార్యాలయానికి తీసుకెళ్లి, దర్యాప్తు చేశారు. బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలను రుజువు చేయడానికి ఆడియో, వీడియో, ఫొటో సాక్ష్యాధారాలను సమర్పించాలని ఆయనపై ఆరోపణలు చేసిన ఇద్దరు మహిళా రెజ్లర్లను పోలీసులు కోరారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా ఉత్తర ప్రదేశ్కు చెందినవారెవరూ ఢిల్లీ పోలీసులకు సాక్ష్యం చెప్పలేదు.
ఈ కేసులో బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా ఆధారాలు, సమాచారాన్ని అందజేయాలని ఇతర దేశాల రెజ్లింగ్ ఫెడరేషన్లకు కూడా ఢిల్లీ పోలీసులు లేఖలు రాశారు. కానీ ఎటువంటి సమాచారం రాలేదు. ఒకవేళ విదేశీ ఫెడరేషన్లు సమాచారం ఇస్తే, అదనపు ఛార్జిషీటును దాఖలు చేస్తారు. ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్తో రెజ్లర్లతో విడివిడిగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బ్రిజ్ భూషణ్పై జూన్ 15 లోపు ఛార్జిషీట్ దాఖలు చేస్తామని మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీ ఇవ్వడంతో రెజ్లర్లు తమ నిరసనలను తాత్కాలికంగా విరమించారు.
More Stories
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ కొత్త అస్త్రం
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్
20 రోజులు కూడా సమావేశం కాని తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలు