మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో ప్రాణహాని ఉందని ఓ మహిళ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. సెజల్ అనే మహిళ ఆరిజిన్ డెయిరీ కో డైరెక్టర్ గా పనిచేస్తోంది. అయితే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను బ్లాక్ మెయిల్ చేస్తూ, పోలీసులతో వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె తెలిపింది.
ఎమ్మెల్యేపై తెలంగాణ పోలీసులకు చాలా సార్లు ఫిర్యాదు చేసినా, ఎమ్మెల్యే తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఫిర్యాదును నమోదుకానివ్వకుండా చేశాడని ఆ మహిళ సోమవారం ఢిల్లీలోని మహిళా కమిషన్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నది. తనకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కమిషన్ హామీ ఇచ్చిందని బాధితురాలు వెల్లడించింది.
ఆ మహిళ ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా తన ఫిర్యాదు గురించి వెల్లడించింది. “తప్పు చేసింది ఎమ్మెల్యే అయినా, ఎవరైనా వదిలిపెట్టేదిలేదు గుర్తుపెట్టుకోండి. ఇకనైనా ఎమ్మెల్యేగారు మీ అనుచరులతో బెదించండం, వేధింపులకు గురిచేయడం ఆపితే మీకే మంచిది” అని బాధితురాలు హెచ్చరించింది.గతంలో ఆమె తమపై లైంగిక వేధింపులకు ఎమ్యెల్యే దిగుతున్నట్లు ఆరోపించారు.
More Stories
తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్ వే
ఖమ్మంలో రాజ్ నాథ్ సింగ్ హెలికాప్టర్ తనిఖీ
పదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ 10 లక్షల కోట్లు