యోగ దినోత్సవాన్ని పండుగలా జరుపుకోవాలి

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకొంటున్నామని చెబుతూ దివాళి, ఉగాదిలా యోగ ఒక పండుగల సంతోషంగా జరుపుకోవాలని తెలంగాణ గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ తెలిపారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ప్రధానమంత్రి కోరుకొంటున్నారని ఆమె చెప్పారు.
 
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో యోగా మహోత్సవ్ కార్యక్రమం జరిగింది. జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా 25 రోజు ముందే కౌంట్ డౌన్ యోగా కార్యక్రమం సందర్భంగా జరిగిన యోగా మహోత్సవ్ లో ఆమె కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి,  ముంజపరా మహేంద్రలతో కలిసిపాల్గొన్నారు
 
కౌన్ డౌన్ కి హైదరాబాద్  వేదిక అవ్వడం గొప్ప విషయం అని చెబుతూఇది చరిత్రలో నిలిచపోయే రోజుని గవర్నర్ కొనియాడారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ చూపించి యోగ చేయాలిని ఆమె సూచించారు.  ప్రతి ఒక్కరు చిన్న పెద్ద.. కులం మతం అని తేడా లేకుండా కలిసి యూనిటీగా  యోగ చేస్తున్నారని ఆమె చెప్పారు.
 
జూన్ 21 అంటే ఫెస్టివల్ ఆఫ్ హెల్త్ అంటూ ఈ చారిత్రాత్మకమైన కార్యక్రమం యోగా మహోత్సవ్ హైదరాబాద్ లో ప్రారంభించడం గర్వకారణం అని చెబుతూ యోగా అభ్యాసం ప్రతి ఒక్కరూ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలని గవర్నర్ చెప్పారు.

యోగా ప్రయోజనలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రజలందరినీ మరింత చైతన్యం చేయడం కోసం ఈ ఏడాది యోగా డేకు 100 రోజుల ముందే శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఈ రోజు యోగలో 100కి పైగా యోగ సంస్థల పెద్దలు పాల్గొన్నారని తెలిపారు.

25 రోజుల కౌన్ డౌన్ ఏకైక కార్యక్రమం ప్రభుత్వం తరుపున భారత దేశంలో మన హైదరాబాద్ లో జరుగుతుందని పేర్కొంటూ యోగ మన జీవన విధానం..మన సంపద అని స్పష్టం చేశారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు యోగ చేయాలని కేంద్ర మంత్రి కోరారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కాగా  ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకొంటున్నామని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ యోగను ప్రపంచం అంతటా తెలియజేయడంతో నేడు యోగ డేను ప్రపంచం అంతటా జరుపుకొంటుందని కొనియాడారు.

2023లో యోగ డే కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని కేంద్ర మంత్రి ముంజపరా మహేంద్ర చెబుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ప్రధాని మోదీ ఎంతో కృషి చేశారని చెప్పారు.  ప్రజలు అందరూ యోగ ఉపయోగాలు తెలుసుకొని యోగ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘు నందన్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డా. లక్ష్మణ్, పుల్లెల గోపిచందన్, హీరో  విశ్వక్ సేన్, హీరోయిన్లు ఇషా రెబ్బ, శ్రీ లీల, డైరెక్టర్ కృష్ణ చైతన్య, బ్యాట్మెంటన్ ప్లేయర్ నైనా జైశ్వల్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.