యోగా ప్రయోజనలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రజలందరినీ మరింత చైతన్యం చేయడం కోసం ఈ ఏడాది యోగా డేకు 100 రోజుల ముందే శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఈ రోజు యోగలో 100కి పైగా యోగ సంస్థల పెద్దలు పాల్గొన్నారని తెలిపారు.
25 రోజుల కౌన్ డౌన్ ఏకైక కార్యక్రమం ప్రభుత్వం తరుపున భారత దేశంలో మన హైదరాబాద్ లో జరుగుతుందని పేర్కొంటూ యోగ మన జీవన విధానం..మన సంపద అని స్పష్టం చేశారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు యోగ చేయాలని కేంద్ర మంత్రి కోరారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కాగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకొంటున్నామని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ యోగను ప్రపంచం అంతటా తెలియజేయడంతో నేడు యోగ డేను ప్రపంచం అంతటా జరుపుకొంటుందని కొనియాడారు.
2023లో యోగ డే కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని కేంద్ర మంత్రి ముంజపరా మహేంద్ర చెబుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ప్రధాని మోదీ ఎంతో కృషి చేశారని చెప్పారు. ప్రజలు అందరూ యోగ ఉపయోగాలు తెలుసుకొని యోగ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘు నందన్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డా. లక్ష్మణ్, పుల్లెల గోపిచందన్, హీరో విశ్వక్ సేన్, హీరోయిన్లు ఇషా రెబ్బ, శ్రీ లీల, డైరెక్టర్ కృష్ణ చైతన్య, బ్యాట్మెంటన్ ప్లేయర్ నైనా జైశ్వల్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
More Stories
దివ్యాంగుల హక్కులు నిజ జీవిత వాస్తవికతగా మారాలి
కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా డా. వంశీ తిలక్
శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష