బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను ఢిల్లీ ఢాకాకు అప్పగించేంత వరకు, బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ బ్రిక్స్ సదస్సుకు హాజరుకావడం గానీ, భారతదేశాన్ని సందర్శించడం గానీ చేయరని స్పష్టం చేసిన్నట్లు తెలుస్తున్నది. ఢాకాలో భారత హైకమిషనర్ దినేష్ త్రివేదితో సమావేశమైనప్పుడు రెహమాన్ ఈ సందేశాన్ని ఆయనకు తెలియజేశారని దౌత్య వర్గాలు తెలిపాయి. ఆ వెంటనే ఆయన ఢిల్లీకి వచ్చి భారత ప్రభుత్వంకు ఆ విషయం స్వయంగా తెలిపారని తెలుస్తున్నది.
రెండేళ్ల క్రితం హసీనా ఢాకా నుండి ఢిల్లీకి పారిపోయినప్పటి నుండి ఈ రెండు పొరుగు దేశాలు పునరుద్ధరించడానికి తీవ్రంగా ప్రయత్నించిన ద్వైపాక్షిక సంబంధాలపై ఈ ప్రకటన కొత్త నీలినీడలను కమ్మేలా చేసింది. భారతదేశంలో ఆమె ఆశ్రయం పొంది రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ఆగస్టు 5న ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్లో హసీనా, ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ నిర్వహించిన విలేకరుల సమావేశం ఫలితంగానే ఢాకా ఈ కొత్త కఠిన వైఖరిని అవలంబించినట్లు స్పష్టమవుతోంది.
ఆమె, ఆమె కుమారుడు అక్కడ సమావేశమైన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కానీ హసీనా స్వరం చాలా దూకుడుగా ఉంది. “వారు నన్ను చంపేయొచ్చు కూడా” అని చెప్పినప్పటికీ, డిసెంబర్లో ఢాకాకు తిరిగి వస్తానని ఆమె శపథం చేశారు. సంబంధాలను హైజాక్ చేయడానికి హసీనా ప్రయత్నించడం పట్ల రెహమాన్, ఆయన నేతృత్వం వహిస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎంతగా అసంతృప్తితో ఉన్నారని వెల్లడి అవుతుంది.
“ద్వైపాక్షిక పర్యటన కూడా, ఢిల్లీ హసీనాను అప్పగించడంపై యాభై-యాభై ఆధారపడి ఉంటుంది” అని ఢాకా ఢిల్లీకి చెప్పిన వాస్తవం ద్వారా స్పష్టమవుతోంది. ఫిబ్రవరిలో ఎన్నికలలో గెలిచిన వెంటనే ప్రధాని మోదీ రెహమాన్కు పంపిన ఆహ్వానం గురించి దౌత్య వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. అలా చేసిన తొలి ప్రపంచ నాయకులలో మోదీ ఒకరు. ఈ ద్వైపాక్షిక ఆహ్వానాన్ని, బ్రిక్స్ కూటమి ఆహ్వానానికి వేరుగా చూస్తున్నారు.
ప్రాంతీయ సంస్థల అధిపతులను ఆహ్వానించే స్థిరపడిన ఆచారానికి అనుగుణంగా, బంగాళాఖాత కూటమి అయిన బిమ్స్టెక్ చైర్మన్ హోదాలో బంగ్లాదేశ్ ప్రధానికి ఆ ఆహ్వానం పంపారు. కానీ ఆగస్టు 5న జరిగిన పత్రికా సమావేశం నుండి భారతదేశం వెంటనే తనను తాను దూరం చేసుకుంది. దానిని నిర్వహించడంలో తమకు ఎలాంటి పాత్ర లేదని అధికారులు పేర్కొన్నారు. అయితే, జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఆ వర్గాలు ధృవీకరించాయి.
కాబట్టి, ఆగస్టు 10న భారత బాహ్య నిఘా సంస్థ రా అధిపతి పరాగ్ జైన్, బంగ్లాదేశ్ ప్రధానికి అత్యంత సన్నిహితుడు, రక్షణ వ్యవహారాల సలహాదారు అయిన బ్రిగేడియర్ జనరల్ (రిటైర్డ్) ఏకేఎం షమ్సుల్ ఇస్లాంను కలవడానికి ఢాకాకు వెళ్లినప్పుడు, ఢాకాలో మారిన వాతావరణం స్పష్టంగా కనిపించిందని ఆ వర్గాలు తెలిపాయి.
ఆగస్టు 10న ఉదయం త్రివేది బంగ్లాదేశ్ ప్రధానిని కలిసినప్పుడు (ఆ సమావేశం 45 నిమిషాల పాటు సాగింది), హసీనాను అప్పగించడంపైనే తన భారత పర్యటన ఆధారపడి ఉంటుందని ఢాకా నిర్ణయించిందని రెహమాన్ ఆయనకు స్పష్టంగా చెప్పారు. ద్విపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని పునరుద్ధరించడానికి భారత్ ఎటువంటి ప్రయత్నాలనైనా చేయడానికి సిద్ధంగా ఉందని త్రివేది బంగ్లాదేశ్ ప్రధానికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. కానీ రెహమాన్ మాత్రం తన పట్టు వీడలేదు.
సమావేశాన్ని భారత్ చేపట్టిన “సానుకూల, నిర్మాణాత్మక, భవిష్యత్తు-ఆధారిత” సంబంధాల ప్రయత్నాలలో భాగంగా మీడియాకు వివరించేందుకు త్రివేది ప్రయత్నించారు. పరిష్కరించలేని సమస్యలేవీ రెండు దేశాల మధ్య లేవని పేర్కొంటూ, బంగ్లాదేశ్ ప్రధాని పర్యటన కోసం భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోందని ఆయన తెలిపారు.
ఢిల్లీలో, గత కొన్ని రోజులుగా, ఒకప్పుడు “బహుముఖ, చిరకాల” సంబంధం అని బహిరంగంగా అభివర్ణించిన బంధం విషయంలో ఢాకా వైఖరి మారడం గురించి త్రివేది ప్రధాని మోదీకి వివరించినట్లు తెలుస్తోంది. భారత్ తూర్పు సరిహద్దు దేశాలతో సంబంధాలను మెరుగుపరచడంలో ప్రధాని స్వయంగా చొరవ తీసుకుంటున్న తరుణంలో, ముఖ్యంగా ఈ పునరుద్ధరించిన “లుక్ ఈస్ట్” (తూర్పు వైపు చూపు) విధానంలో బంగ్లాదేశ్ కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు, రెహమాన్ తీసుకున్న ఈ కఠిన వైఖరి కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది.
వేగంగా మారుతున్న ప్రపంచంలో ఒకరికొకరు అవసరమనే విషయాన్ని బాగా గ్రహించిన ఇరు పక్షాలు, ఇప్పుడు తమ కఠిన వైఖరులను సవరించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బంగ్లాదేశ్ ప్రధాని మలేషియా మరియు చైనాలకు జరిపిన తొలి విదేశీ పర్యటనలను భారత్ నిశితంగా గమనించింది. ఇక హసీనా విషయానికొస్తే, తన జీవితంలో రెండోసారి భారత్లో ఆశ్రయం కోరినందున, పాత, నమ్మకమైన మిత్రుడు షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తెను భారత్ వదిలిపెట్టలేదని దౌత్యపరమైన వర్గాలు పేర్కొన్నాయి.
అయితే, హసీనా నిర్వహించిన విలేకరుల సమావేశం సంబంధాల మెరుగుదలకు తీవ్ర ఆటంకం కలిగించిందని ఆ వర్గాలు అంగీకరించాయి. “తూర్పు సరిహద్దులో భారత్ భద్రతా అవసరాలు అత్యంత కీలకం, కేవలం స్నేహపూర్వక బంగ్లాదేశ్ మాత్రమే వాటిని కాపాడగలదు” అని ఆ వర్గాలు జోడించాయి.

More Stories
నియోజకవర్గాల పునర్విభజనకు డీఎంకే మద్దతు?
ఆయుష్ వైద్య విద్యార్థుల మహా ధర్నా.. ఎబివిపి మద్దతు
నేతాజీపై అనుచిత వ్యాఖ్యలు..బిజెపి ఎంపీ `బంగా విభూషణ్’ తొలగింపు