“ఇది హిందుత్వం కోసం మాట్లాడే నిజమైన స్వేచ్ఛ, విజయం. రాజకీయ నాయుకులు/ జాతి వ్యతిరేకులు/తుగ్డే గ్యాంగ్కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు 20 నుంచి 25 వాణిజ్య ప్రకటనలను రాత్రికి రాత్రే కోల్పోయాను. ఫలితంగా నాకు సంవత్సరానికి రూ. 30 నుంచి రూ. 40 కోట్ల నష్టం వచ్చింది.” అని కంగనా స్పష్టం చేసింది.
అయితే ఎంత నష్టం వచ్చినా తను మాట్లాడాలనుకున్నది ఎవ్వరూ ఆపలేరని కంగనా తెలిపింది. “కానీ నేను స్వేచ్ఛగా ఉన్నాను. దేశ సంస్కృతి, సమగ్రతను ద్వేషించే ఏజెండాతో నడిచే కంపెనీలు, వారి కార్పోరెడ్ హెడ్లు నేను మాట్లాడాలనుకునేది ఆపలేరు” అని ఆమె తెలిపారు.
“ప్రతి ఒక్కరూ బలహీనతలను మాత్రమే ప్రదర్శిస్తారు. కాబట్టి నేను ఎలోన్ మస్క్ను అభినందిస్తున్నాను. కనీసం ధనవంతుడు డబ్బు గురించి పట్టించుకోకూడదని అనుకుంటున్నాను.” అని కంగనా స్పష్టం చేసింది. ప్రస్తుతం కంగనా రనౌత్ పీ వాసు దర్శకత్వంలో చంద్రముఖీ2లో నటించనుంది. అంతేకాకుండా మణికర్ణిక 2 కూడా చేసేందుకు ఆసక్తిగా ఉంది.
ఇది కాకుండా ఎమర్జెన్సీ అనే చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఎమర్జెన్సీ విధించినప్పుడు జరిగిన విషయాలను ఇందులో చూపించనున్నారు. ఈ సినిమాకు ఆమె స్వీయ దర్శకత్వం వహిస్తోంది.
More Stories
అమేథిలో రాహుల్, రాయ్బరేలీలో ప్రియాంక పోటీ?
మోదీ, రాహుల్ ప్రసంగాలపై ఈసీ నోటీసులు
ఏడాదికో ప్రధాని.. ‘ఇండియా’ కూటమి కొత్త ఫార్ములా