ప్రధానమంత్రి మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా, ఇండియాలో సూడాన్ రాయబారి బీఎస్ ముబారక్, ఈజిప్టు, రియాద్ రాయబారులు, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్, కేంద్రం విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ (కాన్సులర్, పాస్పోర్ట్, వీసా అండ్ ఓవర్సీస్ ఇండియన్ ఎఫైర్స్) డాక్టర్ ఎ.సయూద్ తదితరులు పాల్గొన్నారు.
సూడన్లో సైన్యం, పాలమిటరీల బలగాల మధ్య ఘర్షణలో సంఖ్యాపరంగా ఎంతమంది భారతీయులు చిక్కుకున్నారనే దానిపై ఇంకా అస్పష్టత ఉంది. ఘర్షణలు పెరుగుతుండటంతో వేలాది మంది పౌరులు సూడాన్ రాజధాని ఖార్తూమ్ విడిచిపెట్టి వెళ్తున్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఏప్రిల్ 20న న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియా గెటెరెస్తో సమావేశమై సూడాన్లోని పరిస్థితులపై చర్చించారు.
తమ మధ్య సూడాన్ పరిస్థితిపై అర్ధవంతమైన చర్చ జరిగిందని, జీ-20, ఉక్రెయిన్లో ఘర్షణలు కూడా చర్చించామని, అయితే ప్రధానంగా సూడాన్పై చర్చ జరిపామని జైశంకర్ తెలిపారు. సూడాన్లో చిక్కుకున్న భారతీయులతో ఢిల్లీలోని తమ బృందం ఎప్పడికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు.
ఈ నేపథ్యంలో భారతీయ రాయబార కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేరని, వారంతా ఇళ్ల నుంచి పని చేస్తున్నారని తెలిపింది. దీంతో రక్షణ, లేదా సహాయం కోసం భారతీయులు ఇండియన్ ఎంబసీ వద్దకు వెళ్లవద్దని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. సుడాన్లోని భారతీయులు ఇళ్లలోనే ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిస్థితి చక్కబడే వరకు ఎక్కడికీ వెళ్లడానికి ప్రయత్నించవద్దని కోరారు. ఖార్టూమ్లోని రాయబార కార్యాలయం ప్రకారం, సుమారు 2,800 మంది భారతీయులు సూడాన్లో చిక్కుకుపోయారు. దీంతో సూడాన్లో 150 ఏళ్లుగా నివసిస్తున్న వారు 1200 మంది ఉన్నారు.
More Stories
వీసీల నియామకంపై రాహుల్ వాఖ్యాలపై విద్యావేత్తల ఆగ్రహం
ఎన్నికల వేళ అయోధ్యలో మోదీ రామయ్య దర్శనం
ఏపీ డీజేపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు