పగుడాకుల బాలస్వామి
‘మీ జాతకాలు చూస్తాం.. హస్తరేఖలు, పుట్టుమచ్చలు, ఇతర మరకల ఆధారంగా ఉన్నది ఉన్నట్లు చెబుతాం.. మీరు కోరినట్లుగా జాతకం మారుస్తాం.. ఆ తర్వాత మీరు అనుకున్నది జరుగుద్ది.. కనకవర్షం కురిపిస్తాం’ అంటూ అమాయక మహిళలకు పలువురు మాయమాటలు చెప్పి న్యూడ్ ఫొటోలు సేకరించారు.
ఈఘటన మహబూబ్నగర్ జిల్లాలో వెలుగు చూడగా, తవ్విన కొద్దీ వారి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లా పోలీసులు ఈ ముఠాలో ఓ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు మరో ఇద్దరి పేర్లు వెలుగులోకి రాగా, వారి కోసం గాలిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
అత్యంత రద్దీ ప్రాంతమైన బెంగళూరు హైవేను అనుకొని, అనుసంధానం చేసుకొని ఉన్న, రాజధాని నగరం హైదరాబాద్ కు 60 కిమీ దూరంలో, ఖరీదైన జడ్చర్ల పట్టణంలోనిది ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మరో విచిత్రం ఏమిటంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, అటు కర్ణాటక రాష్ట్రం లోని మహిళలు కూడా ఇక్కడ రావడం విశేషం. హిందూ మహిళలకు మాత్రమే జైనుల్లబుద్దీన్ బాబా గారు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు.
జడ్చర్ల పట్టణంలో మహిళలకు మాయ మాటలు చెప్పి జైనుల్లబుద్దీన్ నగ్న పూజలు చేస్తున్నాడు. చిత్ర విచిత్రంగా ఫోటోలు, వీడియోలు తీస్తున్నాడు. ఆ ఫోటోల ఆధారంగా మహిళలను బ్లాక్ మెయిల్ చేసి రకరకాల రూపంలో వాడుకుంటున్నాడు. డబ్బులు గుంజుతున్నాడు. ఈ విషయం బయటపడితే పరువు పోతుందని.. డబ్బుకు ఆశపడి నగ్నంగా పూజ చేయించుకున్న వందలాది మంది బాధితులు తమ బాధను లో లోపలే దిగమింగుతున్నారు.
జాతకాలు మారుస్తామంటూ పలువురు సుమారు మూడు నెలల క్రితం తమతమ స్థానిక ప్రాంతాల్లో జ్యోతిష్య కేంద్రాలు పెట్టుకున్నారు. ఇలా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని కోడుపర్తి, హైదరాబాద్, వికారాబాద్ జిల్లా ఆమన్గల్లో ఎవరి ఇళ్ల వద్ద వారు కార్యకలాపాలు ప్రారంభించారు.
తమ దగ్గరికి వస్తే మంచి జరుగుతుందంటూ తెలిసిన వారి నుంచి విస్తృత ప్రచారం చేపట్టారు. ప్రధానంగా పూలు, పండ్లు, కూరగాయలు విక్రయించే అమాయక మహిళలకు వల వేశారు. ఇలా పురుషులు సైతం చాలా మంది వారికి చిక్కినట్లు సమాచారం. శరీరంపై పుట్టుమచ్చలను తాము స్వయంగా చూసి గుర్తిస్తేనే జాతకం పక్కాగా ఉంటుందని చెప్పారు.
ఫోటోలను పైకి పంపిస్తామని, అక్కడ అమ్మవారికి పూజలు చేస్తారని, మీకు అమ్మవారి పూనకం వస్తుందని, ఆతర్వాత కనక వర్షం కురుస్తుందని, అప్పుడే మాకు కొంత ముట్టాజెప్పాలని నమ్మబలికారు. అలా ఒక్కొక్కరి వద్ద న్యూడ్ ఫొటోలను సేకరించినట్లు సమాచారం. ఉమ్మడి మహబూబ్నగర్తోపాటు రంగారెడ్డి జిల్లాల్లో బాధితులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
జాతకం పేరిట అమాయక ప్రజలను తమ వద్దకు మూడు పర్యాయాలు రప్పించుకుని న్యూడ్ఫొటోలు సేకరించిన అక్రమార్కులు బ్లాక్మెయిలింగ్కు పాల్పడిన క్రమంలో వారి బాగోతం బట్టబయలైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒకరు ఓ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, దీని ఆధారంగా విచారించిన ఖాకీలు జైనొద్దిన్, రాములు అనే వ్యక్తులను ఓ పౌల్ట్రీ ఫామ్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
వారిని విచారించిన క్రమంలో తిరుపతి, శంకర్ పేర్లు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. వారిని పట్టుకునేందుకు ఓ పోలీస్ బృందాన్ని కేటాయించినట్లు వినికిడి. దీనిపై పోలీస్ అధికారులను సంప్రదించగా.. ‘విచారణ జరుగుతోంది.. పూర్తయిన తర్వాత వెల్లడిస్తాం’ అని ముక్తసరిగా సమాధానమిచ్చారు. ఈ విషయంపై రాష్ట్ర మహిళా కమిషన్ మరియు జాతీయ మహిళా కమిషన్, ఇతర మహిళా సంఘాలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మహిళ కమిషన్ దృష్టికి రాకపోవడం గమనార్హం.!
మహిళలకు మాయ మాటలు చెప్పి లైంగికంగా హింసకు గురిచేసిన బాబా జైనుల్లాబుద్దీన్, అతని అనుచరులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్ళకు తలగ్గి పోలీసులు నామ మాత్రం కేసులు నమోదు చేస్తే ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరిస్తున్నారు.
More Stories
చదువుల్ని లోకకల్యాణం కోసం ఉపయోగించాలి
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్