హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ నేతృత్వం వహిస్తున్న కమిటీని రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. ప్రస్తుత కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది. సుప్రీం మాజీ జడ్జి లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వర్సెస్ చార్మినార్ క్రికెట్ క్లబ్ల కేసుపై విచారణ జరిపిన జస్టిస్ ఎస్ కే కౌల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇకపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలను కమిటీ చూసుకుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ నివేదిక ప్రకారం తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. పెండింగ్లో ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఆయన పర్యవేక్షిస్తారని వెల్లడించింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలన్న సుప్రీం ధర్మాసనం.. హెచ్సీఎకు సంబంధించిన అన్ని నిర్ణయాలు తదుపరి చర్యలు లావు నాగేశ్వరావు చూసుకుంటారని చెప్పింది. జస్టిస్ నాగేశ్వరావు కమిటీ నివేదిక ప్రకారం తదుపరి ఆదేశాలు ఇస్తామన్న సుప్రీం.. మార్చి 2వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది.
More Stories
వేముల రోహిత్ దళిత్ కాదు…. కేసు మూసివేత
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదు
ఈసీ ఒప్పుకున్నా పంట పరిహారంపై స్పందించని రేవంత్