రూ.7లక్షల వరకు పన్ను మినహాయింపు

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్‍ పార్లమెంటు ముందుకు వచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‍ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వార్షిక బడ్జెట్ లో మధ్య తరగతి ప్రజలకు, వేతనజీవులకు భారీ ఉపశమనం ఆదాయపన్నులో కలిగించారు. రూ. 7 లక్షల వరకు ఆదాయపు పన్ను పరిమితిని పెంచుతున్నట్లు ఆమె ప్రకటించారు. 

తొమ్మిది లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు 45 వేలు పన్ను చెల్లించానున్నారు. స్టాండర్ట్ డిడక్షన్ రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. రూ.3 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదన్నారు. రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఐదు శాతం పన్ను, రూ6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు పది శాతం పన్ను, రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను పడనుంది. రూ.30 లక్షల దాటితే 30 శాతం పన్ను విధించనున్నారు.
 
 ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో మినహాయింపుల కారణంగా ఏటా ప్రభుత్వానికి రూ.35 వేల కోట్ల ఆదాయం తగ్గనుందని నిర్మల వెల్లడించారు. కొత్త పన్ను విధానం డిఫాల్ట్​గా అమలుకానుందని, అయితే ఈ విధానాన్ని ఎంచుకునే అవకాశం పన్ను చెల్లింపుదారులకే వదిలేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.

 
ఇక రూ.9లక్షల వార్షిక వేతనం పొందుతున్న వ్యక్తులు ఇకపై చెల్లించాల్సిన పన్ను రూ.45వేలు మాత్రమే. ప్రస్తుతం వీరు రూ.60 వేలు చెల్లిస్తున్నారు. రూ.15 లక్షల వార్షిక వేతనం పొందే వ్యక్తులు ఇదివరకు రూ.1.87 లక్షలు చెల్లిస్తుండగా ఇప్పుడు అది రూ.1.5 లక్షలకు తగ్గనుంది. గరిష్ఠ సర్​ఛార్జి రేటు ప్రస్తుతం 37 శాతంగా ఉండగా, దాన్ని 25 శాతానికి తగ్గించారు. ఫలితంగా ఓ వ్యక్తి.. ఇదివరకు చెల్లించే పన్ను 42.74 శాతం ఉంటే, ఇప్పుడది 39 శాతానికి తగ్గనుంది.
 
ఇలా ఉండగా, దిగుమతి చేసుకునే మొబైల్‌ ఫోన్ల విడిభాగాలపై కస్టమ్స్‌ డ్యూటీ స్వల్పంగా తగ్గించారు. ఎలక్ట్రిక్‌ కిచెన్‌ చిమ్నీ కాయల్‌, లిథియం అయాన్‌ బ్యాటరీలపై కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించారు.  ముడి గ్లిజరిన్‌పై 5 శాతం కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించారు.  రొయ్యల మేత తయారీ యూనిట్ల పరికరాలపై కూడా కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించారు. సిగరెట్లపై కస్టం డ్యూటీని 16శాతం పెంచుతున్నట్టు బడ్జెట్​లో ప్రకటించారు​. ఫలితంగా సిగరెట్​ ధరలు 1.5-2శాతం పెరిగే అవకాశం ఉంది.
ఎంఎస్‌ఎంఈలకు ఊరట
 
ఎంఎస్‌ఎంఈలకు వడ్డీ రేట్లలో ఒక శాతం తగ్గింపుతో రూ.2 లక్షల కోట్ల నిధులు
ఎంఎస్‌ఎంఈలకు ముందస్తు పన్ను రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు పెంపు
కొవిడ్‌ కాలంలో పూర్తిచేయలేని పనులకు డిపాజిట్‌ చేసిన మొత్తం తిరిగి చెల్లింపు
ఎంఎస్‌ఎంఈలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారసంస్థలకు డిజిలాకర్‌ సేవల విస్తరణ
మహిళలు, బాలికల కోసం మహిళా సమ్మాన్ బచత్‌ పత్ర పథకం
2025 వరకు అమల్లో మహిళా సమ్మాన్ బచత్‌ పత్ర పథకం
సీనియర్ సిటిజన్స్‌ డిపాజిట్‌ పథకం రూ.15 నుంచి రూ.30 లక్షలకు పెంపు
సిగరెట్లపై కస్టమ్స్‌ డ్యూటీ పెంపు
 
ఐటీ అభివృద్ధి కోసం 30 అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు
 
కోస్తాలో మడ అడవుల అభివృద్ధికి మిస్టీ పేరుతో ప్రత్యేక పథకం
రాంసార్‌ చిత్తడి నేలలు, సరస్సుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
రాంసార్‌ ప్రాంతాల్లోని స్థానికులకు టూరిజం, ఉపాధి కల్పనలో ప్రాధాన్యం
నీతి ఆయోగ్‌ మరో మూడేళ్లు పొడిగింపు
అత్యాధునిక సాంకేతికత నేర్చుకోవడానికి యువతకు ప్రోత్సాహం
నాలుగో పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు
 
దేశవ్యాప్తంగా పర్యాటక ప్రోత్సాహం కోసం 50 పర్యాటక ప్రాంతాలు గుర్తింపు
పోటీ పద్ధతిలో 50 పర్యాటక ప్రాంతాలు గుర్తింపు
మధ్యతరగతి ప్రజలు టూరిస్ట్‌ ప్రాంతాలకు వెళ్లేందుకు దర్శన్‌ స్కీమ్‌
దేఖో అప్నా దేశ్‌ పేరిట మధ్యతరగతికి పర్యాటక పథకం
 
63 వేల సొసైటీల కంప్యూటరీకరణకు రూ.2,516 కోట్లు
5జీ ప్రోత్సాహకానికి యాప్‌ల అభివృద్ధి కోసం వంద ల్యాబ్‌లు
లద్దాఖ్‌లో 13 గిగావాట్ల విద్యుదుత్పత్తికి రూ.20,700 కోట్లు పెట్టుబడులు
ప్రత్యామ్నాయ ఎరువుల అభివృద్ధికి రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
ప్రత్యామ్నాయ ఎరువుల అభివృద్ధికి గోవర్దన్‌ స్కీమ్‌
నేషనల్‌ హైడ్రోజన్‌ మిషన్‌కు రూ.19,700 కోట్లు
ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ.7 వేల కోట్ల నిధులు
కృత్రిమ వజ్రాల తయారీ, అభివృద్ధికి ఐదేళ్ల పాటు ప్రత్యేక ప్రోత్సాహకాలు
 
రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు
ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి కోసం మిషన్‌ కర్మయోగి
రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు
కృత్రిమ మేథ అభివృద్ధికి 3 సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌లు ఏర్పాటు
సాగు, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల కోసం కృత్రిమ మేథ అభివృద్ధి
ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు
డిజిటల్‌ ఇండియాకు అనుగుణంగా వన్‌స్టాప్‌ ఐడెంటిటీ కేవైసీ విధానం
 
రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు
 
రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు
రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు
రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు
2013-14తో పోలిస్తే రైల్వేలకు 9 రెట్లు నిధులు
కర్ణాటక సాగు రంగానికి రూ.5,300 కోట్లు సాయం
 
పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కింద ఏటా రూ.10 వేల కోట్లు
పీఎం ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్లు
చిన్నారులు, యువత కోసం జాతీయ స్థాయిలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు
కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు
మూలధన వ్యయాలు మొత్తం రూ.10 లక్షల కోట్లు
 
గిరిజనుల కోసం పీఎం పీవీటీజీ మిషన్‌ ఏర్పాటు
ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం
సికిల్‌సెల్‌ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక తోడ్పాటు
చిట్టచివరి వ్యక్తి వరకు లబ్ధి చేకూరాలన్నదే రెండో లక్ష్యం
నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీని ప్రోత్సహిస్తాం
గిరిజనుల కోసం పీఎం పీవీటీజీ మిషన్‌ ఏర్పాటు
ఏకలవ్య పాఠశాలలకు 38,800 మంది ఉపాధ్యాయుల నియామకం
మత్స్యరంగానికి రూ.6 వేలకోట్లు
157 నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తాం
 
7 ప్రాధాన్య అంశాలుగా ఈ బడ్జెట్‌
మొదటి ప్రాధాన్యత.. సమ్మిళిత వృద్ధి
ఆత్మనిర్భర క్లీన్‌ ప్లాంట్‌ ప్రోగ్రామ్‌ ప్రకటిస్తున్నాం
శ్రీఅన్న పథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు ప్రోత్సాహం
రూ.20 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు అందిస్తాం
 
పీఎం మత్స్యసంపద యోజనకు అదనంగా రూ.6 వేల కోట్లతో ప్రత్యేక పథకం
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యత పెంచుతాం
గ్రీన్ ఎనర్జీ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు
సహకారంతో సమృద్ధి విధానంలో రైతులకు ప్రోత్సాహం
వ్యవసాయ స్టార్టప్‌ల ప్రోత్సాహకానికి ప్రత్యేక నిధులు.