శ్రీ శైలంలో శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో వివిధ ప్రాంతాల నుండి 85 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. సంస్కృత ఫౌండేషన్ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి డా. సి ఉమామహేశ్వరరావు, శివాజీ స్ఫూర్తి కేంద్ర వ్యవస్థాపక సభ్యుడు రఘురామయ్య తదితరులు కూడా ప్రసంగించారు.
“శివాజీ పాలనా యంత్రాంగం, పౌరసేవల వ్యవస్థ” అంశంపై జరిగిన సదస్సులో పూణేలోని భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (బిఓఆర్ఐ)కి చెందిన డా. ఎస్ ఎల్ బా పట్ మాట్లాడుతూ మొదట శివాజీ ‘వాటనాదారి’ (జాగీర్దారి’) వ్యవస్థను ‘వేటనాదారి’గా మార్చడం ప్రారంభించాడని, ఇది రాష్ట్ర ఉద్యోగుల లాంటి వ్యవస్థ అని తెలిపారు. ఆ తర్వాత అతను భాష ‘శుద్ధి’ చేపట్టి పర్షియన్ పదాల స్థానంలో సంస్కృత పదాలతో 1100 పదాల అధికారిక నిఘంటువు తయారు చేశారని చెప్పారు. ఒక ప్రజల భాషను మార్చడం వారి ‘జాతీయత’ని మార్చినట్లే అని గ్రహించి, మరాఠీ భాష పునర్-భారతీకరణ ఓ ముఖ్యమైన చర్య అని వివరించారు.
భోపాల్ కు చెందిన గిరీష్ జోషి ప్రసంగిస్తూ ప్రజలకు సమర్థవంతమైన సేవలందించడమే ఛత్రపతి శివాజీ పాలన లక్ష్యమని అని పేర్కొన్నారు. శివాజీ అలా చేయడం దైవిక సేవ అని, సనాతన విలువలు, విశ్వాసాన్ని పునరుద్ధరించాలనే దేవుని సంకల్పాన్ని అమలు చేయడానికి అతను ఒక సాధనమని చెప్పారు. పాలనలో పారదర్శకత పాటిస్తూ వృద్ధులను, రోగులను, వికలాంగులను ఆదుకున్నాడని, బంధుప్రీతి అనేడిదే లేదని స్పష్టం చేశారు. అన్నింటికంటే, అందరికీ న్యాయమైన పాలన అందించారని తెలిపారు.
బిలాస్పూర్లోని జిజి యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ప్రధాన్ మాట్లాడుతూ ఆధునిక హిందూ స్వరాజ్యాన్ని సృష్టించిన ఘనత శివాజీకి దక్కుతుందని తెలిపారు. సమ్మిళిత ప్రజాస్వామ్యం ఛత్రపతి శివాజీ మంత్రంగా కనిపిస్తుందని పేర్కొంటూ అతను సమర్థవంతమైన పాలన కోసం అధికార ఆదేశాల ముఖ్యమైన పొరను సృష్టించాడని చెప్పారు.
మొదటి భారత నౌకాదళం నిర్మాత
“శివాజీ సైనిక వ్యూహం” అంశంపై వైస్ అడ్మిరల్ మురళీధర్ పవార్ మాట్లాడుతూ శివాజీ తన సైనిక ఉపకరణాన్ని అభివృద్ధి చేయడంలో అసాధారణమైన నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడని, సముద్ర వాణిజ్యాన్ని కాపాడటానికి కొంకణ్, గోవా తీరాల వెంబడి శక్తివంతమైన నౌకాదళ ఉనికిని స్థాపించాడని వివరించారు. శివాజీ నిర్మించిన శక్తివంతమైన నౌకాదళం కారణంగా మరాఠాలు బ్రిటిష్, పోర్చుగీస్, డచ్లకు వ్యతిరేకంగా నిలబడగలిగారని చెప్పారు.
శివాజీ సురక్షితమైన తీరం విలువను, పశ్చిమ కొంకణ్ తీరప్రాంతాన్ని నౌకాదళ దాడుల నుండి రక్షించవలసిన అవసరాన్ని అర్థం చేసుకున్నాడని చెప్పారు. శక్తివంతమైన నౌకాదళాన్ని సృష్టించడం ద్వారా తన సామ్రాజ్యాన్ని పటిష్టం చేయడానికి, రక్షించడానికి ప్రణాళిక వేసుకున్నాడని పేర్కొన్నారు. కళ్యాణ్, భివండి, గోవా వంటి నగరాల్లో, శివాజీ వాణిజ్యం , యుద్ధ నౌకాదళం నిర్మాణం కోసం నౌకలను నిర్మించారని తెలిపారు.
అనేక సముద్ర కోటలు, స్థావరాలను కూడా నిర్మించాడని చెబుతూ దక్కన్లోని ఎనిమిది లేదా తొమ్మిది ఓడరేవులను స్వాధీనం చేసుకున్న తర్వాత, విదేశీయులతో వ్యాపారం చేయడం ప్రారంభించాడని వివరించారు.
More Stories
మహిళలు, రైతులు, నిరుద్యోగులపై కూటమి వరాల జల్లు
బీజేపీకి 400 సీట్లు పక్కా! ఓటమి భయంతో ప్రతిపక్షాలు
ప్రైవేటు వ్యక్తుల పక్షాన ప్రభుత్వం పిటిషన్ వేయడమా?