80 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ లతో అతిపెద్ద ‘కనెక్ట్’ దేశంగా భారత్

80 కోట్లకు పైగా బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులతో ప్రపంచంలోనే అతిపెద్ద ‘కనెక్ట్’ దేశంగా భారతదేశం అవతరించిందని కేంద్ర  ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక అభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు.  ‘సాధికారత కలిగిన భారతదేశం అభివృద్ధికి సాంకేతిక వినియోగం’ అనే అంశంపై జరిగిన ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ 2022 ముగింపు సమావేశంలో ప్రసంగించారు.
 5జి, భారత్ నెట్ అందిస్తున్న అతి పెద్ద గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ నెట్ వర్క్ ను 1.2 బిల్లియన్లకు పైగా ప్రజలు వినియోగిస్తున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రపంచ ఇంటర్నెట్ రంగంలో ఇంత పెద్ద సంఖ్యలో భారతదేశం మాత్రమే వినియోగదారులను కలిగి ఉందని మంత్రి వివరించారు. పరిస్థితికి అనుగుణంగా సాంకేతిక ఆవిష్కరణలు తీసుకువస్తున్నామని దీనికి అనుగుణంగా నియంత్రణ విధానాలను రూపొందిస్తున్నామని చెప్పారు.
ఈ గ్లోబల్ స్టాండర్డ్ సైబర్ లా వ్యవస్థ మూడవ దశలో సంబంధిత వర్గాలు పాల్గొంటాయని పేర్కొన్న మంత్రి దీనివల్ల భారతదేశ ఇంటర్నెట్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆర్థిక పురోభివృద్ధికి సహకరిస్తుందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో అభివృద్ధి చెందిన విధంగా దక్షిణ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను డిజిలీ కరణ చేయలేక పోయాయని  చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ఈ రంగంలో ప్రపంచ దేశాలకు అవసరమైన సహకారం, సాంకేతిక అంశాలను అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.  గుర్తింపు ప్రమాణీకరణ అంశంలో భారతదేశం అత్యంత శక్తివంతమైన దేశంగా అవతరించిందని చెప్పారు. తమ ఆర్థిక వ్యవస్థలను డిజిటల్ ఆర్థిక వ్యవస్థలుగా  అభివృద్ధి చేయాలని భావిస్తున్న అన్ని దేశాలకు భారతదేశం సహకరిస్తుందని జీ20 అధ్యక్ష హోదాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన అంశాన్ని మంత్రి గుర్తు చేశారు.
భారతదేశ తరహాలో పరిపాలన సాగించాలని భావిస్తున్న అన్ని దేశాలకు భారతదేశం అండగా ఉంటుందని చెబుతూ అనేక ప్రయత్నాలు జరిగిన తర్వాత భారతదేశం తన ఇంటర్నెట్ వ్యవస్థకు బహుముఖ రూప వ్యవస్థగా అభివృద్ధి చేయడంలో విజయం సాధించిందని మంత్రి పేర్కొన్నారు. రానున్న సంవత్సరాల్లో బహుముఖ రూప వ్యవస్థ కేవలం మేధావుల చర్చకు పరిమితం కాకుండా మరింత వృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
దేశంలో ఇంటర్నెట్ వినియోగం మరింత పెరగాలని చెబుతూ సురక్షిత, నమ్మదగిన వినూత్న ఆవిష్కరణలు, జవాబుదారీతనం వృద్ధికి దోహదపడతాయని తెలిపారు. డిజిటల్ విధానాలు నమ్ముతున్న ప్రజలకు వ్యవస్థకు జవాబుదారీగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.

డిజిటల్ అక్షరాస్యతలో భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని  ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి ఆల్కేష్ కుమార్ శర్మ తెలిపారు. డిజిటల్ రంగంలో అవసరమైన నైపుణ్య అభివృద్ధికి డిజిటల్ ఇండియా మిషన్ కృషి చేస్తుందని చెప్పారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో సాధించిన అభివృద్ధితో  నవ భారతదేశ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. 

గోప్యత, రక్షణ, డేటా, భద్రత, సంరక్షణ అంశాలపై పదునైన చట్టాలు రూపొందించాలని నిర్ణయించామని చెబుతూ రాబోయే మూడేళ్లలో ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై దృష్టి సారించి పని చేస్తున్నామని ఆయన తెలిపారు.